బడులను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

బడులను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

Jun 26 2025 6:45 AM | Updated on Jun 26 2025 6:45 AM

బడులన

బడులను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

విజయపురి సౌత్‌: రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకర్‌రావు బుధవారం మాచర్ల మండలం ఎత్తిపోతల (7 మైలు) గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఇంటర్మీడియట్‌ వరకు బడిని అప్‌గ్రేడ్‌ చేయించాలని గిరిజన నాయకులు, ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చైర్మన్‌ హామీ ఇచ్చారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, అభినందించారు. తర్వాత బ్రహ్మానందపురం తండాను సందర్శించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. విజయపురి సౌత్‌లోని పీటీజీ పాఠశాల విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఎస్టీ కమిషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సాంబయ్య, డీటీడబ్ల్యూ జోత్న్స, తహసీల్దార్‌ కిరణ్‌ కుమార్‌, పీటీజీ పాఠశాల ప్రిన్సిపల్‌ మురళీ శ్రీనివాస్‌, గిరిజన సలహా మండల సభ్యులు రావుల కొండలు, జెడ్పీటీసీ మల్లుస్వామి, మాజీ సర్పంచ్‌ కరంటోత్‌ పాండు నాయక్‌, నాగేశ్వరరావు నాయక్‌, బొల్లా వెంకటేశ్వర్లు చౌదరి, బాలాజీ నాయక్‌ బామల నాయక్‌, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లు బదిలీ

నరసరావుపేట: జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దార్లు (డీటీ)లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు టి.కొండారెడ్డిని నకరికల్లుకు, అరుణదేవిని బెల్లంకొండకు, షేక్‌ సాల్మన్‌ను నాదెండ్లకు, ఎస్‌.శ్యామలతను పెదకూరపాడుకు, కె.శ్రీనివాసరావును నరసరావుపేటకు, బి.సుబ్బారావును శావల్యాపురానికికు, పి.తులసీరామ్‌ను నూజెండ్లకు, జి.వెంకటరమణను రెంటచింతలకు, పి.బ్రహ్మయ్యను దాచేపల్లికి, కె.రాజశేఖర్‌ నాయక్‌ను వెల్దుర్తికి, పి.వెంకటరెడ్డిని రొంపిచర్లకు, కె.బాలవెంకటేష్‌ను ముప్పాళ్లకు, ఎన్‌.అనూరాధను యడ్లపాడుకు, షేక్‌ బాషాను మాచర్లకు, ఎం.రాజాను అమరావతికి, సీహెచ్‌.లక్ష్మీప్రసాద్‌ను సత్తెనపల్లికి, పి.నరసయ్యను బొల్లాపల్లికి, ఐ.ఫణీంద్రను గురజాల ఆర్డీవో కార్యాలయానికి, జి.విద్యాసాగర్‌ను కారంపూడికి బదిలీ చేశారు.

సాయిబాబాకు ప్రత్యేక పూజలు

వినుకొండ: పట్టణంలోని షిరిడీ సాయిబాబా దేవస్థానంలో 34వ గురుపౌర్ణమి మహోత్సవాల సందర్భంగా బుధవారం భారీ గణపతి రూపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బడులను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ 1
1/1

బడులను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement