బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి

Jun 24 2025 4:27 AM | Updated on Jun 24 2025 4:27 AM

బదిలీ

బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి

సచివాలయ ఉద్యోగుల వినతి

నెహ్రూనగర్‌: బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం.5ను సవరించాలని సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ హాల్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యాలయంలో అదనపు కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెబ్‌ కౌన్సిలింగ్‌ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరారు. సొంత మండలాల నిబంధనను తీసివేయాలని, అంతర్‌ జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సొంత మండలాల ప్రాతిపదికగా కాకుండా అర్బన్‌ లోకల్‌ బాడీ(యుఎల్‌బీ)లోని వార్డును తీసుకోవాలని, గ్రామాల్లో పంచాయతీని ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. ప్రమోషన్‌తో పాటు స్పష్టమైన సర్వీస్‌ రూల్స్‌ను రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని విన్నవించారు. మిగులు ఉద్యోగులను సీనియారిటీ ఆధారంగా వివిధ శాఖల్లోనికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయాల అసోసియేషన్‌ నాయకులు అబ్దుల్‌ రజాక్‌, ధనలక్ష్మి, అనురాధ, మధు, రామకృష్ణ, రాజకుమార్‌ పాల్గొన్నారు.

అండర్‌–14 టెన్నిస్‌ విజేత విన్సెంట్‌

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): గ్లోబల్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌, వీవీవీ హెల్త్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులో సోమవారం జరిగిన అండర్‌–14 టెన్నిస్‌ పోటీల్లో మిక్స్‌డ్‌ సింగిల్స్‌ విజేతగా కె. విన్సెంట్‌, రన్నర్‌గా జి.దిశాంత్‌ నిలిచారు. డబుల్స్‌ విభాగంలో దిశ, విన్సెంట్‌ జోడీ విన్నర్‌గానూ జి.దిశాంత్‌, కల్యాణీలు రన్నర్స్‌గా నిలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఆపిల్‌ డెంటల్‌ కేర్‌ అధినేత డాక్టర్‌ హనుమంతరావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీవీవీ హెల్త్‌ క్లబ్‌ డెరెక్టర్‌ హరికృష్ణ, మధుస్మిత, గ్లోబల్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌, ఆనంద్‌ కుమార్‌, అరుణ్‌ కుమార్‌, చరణ్‌ పాల్గొన్నారు.

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూజిలాండ్‌ అధ్యక్షుడిగా బుజ్జిబాబు

గుంటూరు ఎడ్యుకేషన్‌ : న్యూజిలాండ్‌లో అవర్‌ స్టేట్‌ అవర్‌ లీడర్‌ ఇంటిలెక్చ్యువల్‌ ఫోరం కో–ఆర్డినేటర్‌, వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న నెల్లూరి బుజ్జిబాబు ఆంధ్ర తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూజిలాండ్‌ అధ్యక్షుడిగా ఎన్నికై నట్లు గుంటూరుకు చెందిన ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌గా న్యూజిలాండ్‌లోని తెలుగువారిని సమన్వయపర్చడంతో పాటు, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా బుజ్జిబాబుకు అభినందనలు తెలియజేశారు.

టోల్‌గేట్‌ వద్ద గంజాయి పట్టివేత

మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కాజ టోల్‌ గేట్‌ వద్ద భారీగా గంజాయి, మెత్‌ డ్రగ్స్‌ను ఈగల్‌ టీమ్‌ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి వైజాగ్‌కు బస్సులో వెళుతున్న యువకుడు భారీగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఈగల్‌ టీమ్‌ సోమవారం కాజ టోల్‌ గేట్‌ వద్ద నిఘా వేసింది. గంజాయి తరలిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకుంది. అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయితో పాటు రూ. 3 లక్షల విలువైన మెత్‌ను స్వాధీనం చేసుకుంది. యువకుడిని మంగళగిరి రూరల్‌ పోలీసులకు అప్పగించింది. గంజాయి, మెత్‌ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు..ఎంత మంది ఉన్నారనే ? అంశాలపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి 1
1/1

బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement