
హోరాహోరీగా అండర్–17 బాలుర వాలీబాల్ పోటీలు
సత్తెనపల్లి: పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ 54వ హైదరాబాద్ రీజియన్ స్థాయి అండర్–17 బాలుర వాలీబాల్ పోటీలు శనివారం హోరాహోరీగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి (రామకృష్ణాపురం)లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ఆవరణలో అండర్ –17 బాలుర వాలీబాల్ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించారు. పోటీల్లో క్రీడాకారులు నువ్వా .. నేనా అన్నట్లు తలపడ్డారు. పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 18 జట్లు హాజరయ్యాయి. శనివారం రాత్రి ఫ్లడ్లైట్ల వెలుగులో కూడా పోటీలు కొనసాగించారు. ఎనిమిది జట్లు ఖమ్మం, సత్తెనపల్లి, హక్కింపేట్, విజయవాడ–1, తెనాలి, వెంకటగిరి, వాల్తేరు, కర్నూల్ జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ఆదివారం క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేపడుతామని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ సత్తెనపల్లి ఇన్చార్జ్ ప్రిన్సిపల్ బి.కిరణ్రెడ్డి తెలిపారు. పంజాబ్లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ జట్టును కూడా ఇక్కడ ఎంపిక చేయనున్నారు. వాలీబాల్ పోటీలను వీక్షించేందుకు క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో రిఫరీలు తదితరులు పాల్గొన్నారు.