ఇప్పుడిచ్చే ధర పెట్టుబడికే చాలదు | - | Sakshi
Sakshi News home page

ఇప్పుడిచ్చే ధర పెట్టుబడికే చాలదు

Apr 27 2025 1:53 AM | Updated on Apr 27 2025 1:53 AM

ఇప్పుడిచ్చే ధర పెట్టుబడికే చాలదు

ఇప్పుడిచ్చే ధర పెట్టుబడికే చాలదు

ఎకరం రు.15వేలు ముందస్తు కౌలుతో ముప్పాతిక ఎకరంలో పసుపు పంట సాగు చేశా. ఇప్పటికి రు.లక్ష వరకు పెట్టుబడి అయింది. మొత్తం 20 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. పంట చేతికంది, అమ్ముకునే సమయానికి క్వింటా రూ.11వేలకు అడుగుతున్నారు. పైగా ఎండబెట్టాలని చెబుతున్నారు. రైతులంటే అందరికీ చులకనే. గత ఏడాది పచ్చి సరుకే రూ.13,300 కొనుక్కోని పోయారు. ఇప్పుడిచ్చే ధరతో పెట్టిన పెట్టుబడికి సరిపోదు.

– ఆళ్ల వెంకటేశ్వర్లు, చాగంటివారిపాలెం

ఎకరం పొలంలో పసుపు సాగు చేశా. ఇప్పటికి కౌలు, కూలీలు, ఎరువులు, పురుగుమందులకు రూ.1.10లక్షలు పెట్టుబడి పెట్టా. ఇవి కాకుండా విత్తనం కొమ్ము కొనుగోలుకు రూ.60వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. దిగుబడి చూస్తే 20 నుంచి 25 క్వింటాళ్ల వరకే వచ్చేలా ఉంది. నిజమాబాద్‌ మార్కెట్‌లో క్వింటా రూ.14వేల వరకు ధర ఉందని బంధువులు చెప్పారు. ఇక్కడేమో రూ.10వేలకు అడుగుతున్నారు. దళారుల ఇష్టారాజ్యంగా మారింది. ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుంది.

– పసుపులేటి వీరాంజనేయులు,

చాగంటివారిపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement