గ్యాస్ కొరతతో అన్నదాన ప్రసాదాలను గతంలో లాగా అన్లిమిటెడ్ విధానంలో కాకుండా లిమిటెడ్ విధానంలో టోకెన్ల సంఖ్యలో అందజేస్తున్నాం. అలాగే దర్శనాలకు వచ్చిన భక్తులకు అత్యంత ప్రాధాన్యతగా ఈ ప్రసాదాలను అందించాలని ఆదేశించాం. గ్యాస్ బండలు డెలివరీ తక్కువగా వస్తున్న నేపథ్యంలో రోజుకు సగటున 500 మంది భక్తులకు మాత్రమే అన్నప్రసాదాలను అందించేలా చర్యలు చేపట్టాం. గ్యాస్ కొరత సమస్య ఇంకా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎన్జీ విధానాన్ని అమలు చేసేలా ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– కేఎన్వీడీవీ ప్రసాద్,
అరసవల్లి ఆలయ ఈవో
●


