పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీలో గురువారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగాభ్యాసాలు, కంటి పరీక్షలు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి డాక్టర్ సన్యాసి బెహరా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సన్యాసి బెహారా, డీన్ డాక్టర్ సుశాంత్ కుమార్ పట్నాయిక్, పర్లాకిమిడి డిప్యూటీ సూపరింటెండెంటు (సైబర్విభాగం) సరితా బెవురియా, సంజయ్కుమార్ పాఢి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు కంటి పరీక్షలు కూడా చేశారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, డీన్ సుశాంత్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.


