
గవర్నర్ పిలుపు
వ్యవసాయ
స్వావలంబనకు
భువనేశ్వర్:
వ్యవసాయ రంగంలో లోటు అంశాలను గుర్తించి ఒడిశాను స్వయం సమృద్ధిగా మార్చేందుకు విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వ విద్యాలయం (ఓయూఏటీ), ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (ఐఎస్ఏఎం) సంయుక్తంగా స్థానిక ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఓయూఏటీ) నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రాయోజిత పథకాలను విద్యా పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరాన్ని తెలియజేశారు. తద్వారా ఎక్కువ మంది ముఖ్యంగా రైతులు వారికి అందుబాటులో ఉన్న ప్రయోజనాలను పొందగలుగుతారు. రైతులలో వ్యవస్థాపకతను పెంపొందించే మరియు ఆధునిక వ్యవసాయ వ్యాపార పద్ధతుల కోసం నైపుణ్యం ఆధారిత శిక్షణతో వారిని సన్నద్ధం చేసే సమగ్ర నమూనాను ఆవిష్కరించాలని విద్యావేత్తలు, విధాన నిర్ణేతలను కోరారు. రాష్ట్రంలో ప్రత్యేకమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, తీరప్రాంత మైదానాల నుంచి అటవీప్రాంత ఎత్తైన ప్రాంతాల వరకు విభిన్న వ్యవసాయ కార్యకలాపాలకు అనువైనవిగా ఉన్నాయి. రాష్ట్రంలో 50 శాతం కంటే ఎక్కువ జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ వ్యాపారం గ్రామీణ శ్రేయస్సు మరియు ఉపాధి కల్పనకు శక్తివంతమైన ఇంజిన్గా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పాదన, విలువల జోడింపు, శీతల గిడ్డంగులు వంటి చర్యలు పసుపు, మిల్లెట్లు, మామిడి, సముద్ర చేపలు, కూరగాయలు వంటి ఎగుమతి ఆధారిత వ్యవసాయంలో అధిక సంభావ్య పంటలు, పదార్థాల ఉత్పాదనకు దోహదపడతాయి. రాష్ట్రానికి గణనీయమైన ఆర్థిక వనరుల్ని సమకూర్చి స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు వారధిగా నిలుస్తాయన్నారు. వ్యవసాయ వ్యాపార వృద్ధికి స్థిరమైన మార్గాలను చర్చించడానికి పరిశోధకులు, విధాన రూపకర్తలు మరియు వాటాదారులు ఇక్కడ సమావేశం కావడం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. ఉద్యానం, మత్స్య సంపద, పాడి, మొక్కజొన్న, పప్పుఽ దాన్యాలు వంటి రంగాల పెరుగుదల ద్వారా రాష్ట్రం జీవనాధార వ్యవసాయం నుండి మార్కెట్ ఆధారిత వ్యవసాయానికి మారుతోందని అన్నారు. గ్రేడింగ్, ప్యాకేజింగ్, పంటకోత నిర్వహణలో శిక్షణ ఇవ్వడం ద్వారా రైతులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించాల్సిన అవసరాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రాధాన్యత కల్పించారు. క్లస్టర్ ఆధారిత నమూనాల ద్వారా ఎఫ్పీఓలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న ఉత్పత్తిదారులను బలోపేతం చేయాలని తెలిపారు. ఐఎస్ఏఎం కార్యదర్శి డాక్టర్ టి.సత్యనారాయణ్, సంబల్ పూర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిధు భూషణ్ మిశ్రా, ఓయూఏటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రభాత్ కుమార్ రౌల్, ఓయూఏటీ వ్యవసాయ కళాశాల డీన్ ప్రొఫెసర్ హృషీకేష్ పాత్రో ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా అతిథులు సదస్సు జ్ఞాపిక సంచికను ఆవిష్కరించారు.

గవర్నర్ పిలుపు

గవర్నర్ పిలుపు