
బిన్నీస్పూర్లో జ్వరాలు
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి గడిశెశిఖాల్ పంచాయతీలొని బిన్నీస్పూర్ గ్రామంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. గత వారం రోజులుగా గ్రామంలో జనం తలనొప్పి, జ్వరం, కాళ్ల నొప్పులు వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. దాదాపు 50 మందికి పైగా మంచాన పడ్డారు. కొలనార ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ప్రత్యేక మెడికల్ టీం గ్రామానికి చేరుకుంది. శని, ఆదివారాల్లో ఆ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి వ్యాధితో బాధపడుతున్న వారి రక్తనమూనాలను సేకరించింది. శనివారం 35 మందికి రక్తపరీక్షలు చేయగా ఇందులో సునాయి పెద్దింటి, విశ్వనాత్ ముండుక, బొర్షాముండుకలకు మలేరియా సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్య శాఖ పరిస్థితి విషమించకముందే అదుపులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టింది. మలేరియా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ జ్యొత్సామయి రవుతొ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం గ్రామంలొ పర్యటించి గ్రామస్తులు వినియోగిస్తున్న తాగునీటి వనరులను పరిశీలించారు. మలేరియా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ఆశా కార్యకర్తలు గ్రామస్తులకు వివరించడంతో పాటు దొమతెరలను పంపిణీ చేశారు.

బిన్నీస్పూర్లో జ్వరాలు

బిన్నీస్పూర్లో జ్వరాలు