
కుప్పకూలిన ఉపాధి వేతనదారుడు
టెక్కలి: సీతాపురం పంచాయతీ వలియాసాగరం గ్రామంలో శుక్రవారం ఉపాధి పని చేస్తున్న పైల ధనుంజయరావు ఒక్కసారిగా కుప్పకూలి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి వేతనదారులు ధనుంజయరావును టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఏపీఓ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని వేతనదారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదే పంచాయతీలో ఇటీవల క్షేత్ర సహాయకుడి తొలగింపు విషయంలో రాజకీయం ప్రమేయం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్చార్జి క్షేత్ర సహాయకుడు నియామకం విషయంలో మండల స్థాయి అధికారులు జిల్లా అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేశారంటూ పలువురు వేతనదారులు చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనతో సీతాపురం పంచాయతీ ఉపాధి హామీ పనుల్లో మరోసారి రచ్చ చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి తీవ్ర గాయాలు
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నరసన్నపేట నుంచి కోటబొమ్మాళి వైపు వెళ్తున్న లాగేజ్ వ్యాన్ హరిశ్చంద్రాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న ఎన్.ఉమా, పి.లోకేష్లకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు ని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.