రైలు ఢీకొని యువకుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని యువకుడికి గాయాలు

May 16 2025 12:26 AM | Updated on May 16 2025 12:26 AM

రైలు

రైలు ఢీకొని యువకుడికి గాయాలు

కాశీబుగ్గ: కాశీబుగ్గ ఎల్‌సీ గేట్‌ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రి రిమ్స్‌కు తరలించారు. గాయపడిన వ్యక్తి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన యువకుడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అపస్మారక స్థితిలో విశ్రాంత ఉద్యోగి

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో గురువారం ఓ ప్రయాణికుడు దుస్తులు లేకుండా అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని ఆర్టీసీ ఎస్‌ఎం ఎంపీ రావు గమనించారు. వెంటనే కాంప్లెక్స్‌ ఔట్‌పోస్ట్‌ హెచ్‌సీ ఎన్‌.శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. ఆయన వచ్చి పక్కనే ఉన్న దుస్తులను పరిశీలించగా ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబరు లభించాయి. వాటి ఆధారంగా కంచిలి మండలం పెద్దపోలేరు గ్రామానికి చెందిన తులసీదాస్‌ వెంకటస్వామి మల్లపురెడ్డిగా గుర్తించా రు. విశ్రాంత ఉద్యోగి అని, కుటుంబ సభ్యులు ముంబైలో ఉంటున్నట్లు తెలుసుకుని వారికి సమా చారం అందించారు. ఇటీవల కంచిలి మండలం పెద్దపోలేరులో జరిగిన పండగలకు వచ్చి తిరుగు ప్రయాణంలో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు గుర్తించి 108 రిమ్స్‌కు తరలించారు. ఆర్టీసీ సెక్యూరి టీ గార్డు జి.రామారావు తదితరులు ఉన్నారు.

రైలు ఢీకొని యువకుడికి గాయాలు   1
1/1

రైలు ఢీకొని యువకుడికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement