విద్యుత్‌ స్తంభంపై మంటలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభంపై మంటలు

May 15 2025 12:58 AM | Updated on May 15 2025 12:58 AM

విద్య

విద్యుత్‌ స్తంభంపై మంటలు

జయపురం: కొరాపుట్‌ జిల్లా సెమిలిగుడ – నందపూర్‌ మార్గంలో ఒక విద్యుత్‌ స్తంభంపై బుధవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్‌ విభాగ ఎస్‌డీవోకు సమాచారం అందజేశారు. విద్యుత్‌ సిబ్బంది స్పందించి సరఫరాను నిలిపివేశారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సునాబెడ ఎస్డీవో గోపాల కృష్ణ ప్రధాన్‌ మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

షడ్భుజ గౌరంగ రూపం

విత్ర వైశాఖ కృష్ణ పక్షం ప్రతిపాద తిథి పురస్కరించుకుని పూరీ శ్రీజగన్నాథుని ప్రతినిథి మదన మోహనుడు షడ్భుజ గౌరంగ రూపంలో దర్శనమిచ్చాడు. స్వామి వెలుపలి చందన యాత్రలో భాగంగా 13వ రోజున నరేంద్ర పుష్కరిణి చందన మండపంపై ఈ అలంకారంలో స్వామి నవకాంతులు వెదజల్లాడని భక్తులు మురిసిపోయారు. – భువనేశ్వర్‌

విద్యుత్‌ స్తంభంపై మంటలు 1
1/1

విద్యుత్‌ స్తంభంపై మంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement