
కిట్ విశ్వవిద్యాలయ విద్యార్థిని మరణం
● విదేశాంగ శాఖ సంతాపం ● యూజీసీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు ● క్యాంపస్ ప్రాంగణంలో పోలీసుల డేరా
భువనేశ్వర్:
స్థానిక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటి – కిట్) విశ్వవిద్యాలయ హాస్టళ్లలో నేపాల్కు చెందిన విద్యార్థినుల మరణాలు వరుసగా చోటు చేసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఈ విశ్వ విద్యాలయంలో నేపాలీ విద్యార్థి ప్రిషా షా మరణం అనుమానాస్ప దమైంది. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శుక్రవారం సాయంత్రం నుంచి క్యాంపస్లో పోలీసుల బృందం డేరా వేసింది. మరో వైపు ఈ విషాద సంఘటనపై విచారణ జరిపేందుకు పలు ప్రముఖ వర్గాలు ఎవరి తరహాలో వారు రంగంలోకి దిగారు. పోలీసు కమిషనర్, డిప్యూటీ పోలీసు కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఘటనా స్థలం సందర్శించారు. విద్యార్థిని విషాదకర మర ణం పట్ల విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసి సంతాపం ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో మృతు ల కుటుంబానికి సానుభూతిని తెలియజేసింది. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఒడిశా ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
రెండో నేపాలీ విద్యార్థి మరణం
ఈ క్యాంపస్లో నేపాలీ విద్యార్థి మృతి చెందడం వరుసగా ఇది రెండోసారి. మృతుల కుటుంబానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించింది. ప్రస్తుతం ఒడిశా పోలీసులు సమగ్ర విచార ణ నిర్వహిస్తున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీ య విద్యార్థుల భద్రత, రక్షణ, శ్రేయస్సును తీవ్రంగా పరిగణిస్తుందని ఈ శాఖ పేర్కొంది. ఈ విషయంలో అనుక్షణం తాజా సమాచారం కోసం సమన్వయాన్ని నిర్ధారించడానికి నేపాలీ అధికారులు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, కిట్ నిర్వహణ యంత్రాంగంతో తాము సన్నిహితంగా ఉంటున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
మరోవైపు ప్రిషా షా మరణంపై నేపాల్ రాయబా ర కార్యాలయం సంస్థ ప్రతినిధులు, పోలీసు అధికారులు మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు సంబంధిత ఇతర పార్టీలను సంప్రదించి చర్చలు జరిపింది. నేపాల్ రాయబార కార్యాలయం కూడా ఈ సంఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తును డిమాండ్ చేసింది. కిట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నేపాలీ విద్యార్థులందరి భద్రత, రక్షణను నిర్ధారించడం కీలకంగా పే ర్కొంది. ఈ విషయానికి సంబంధించి నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు ప్రధానమంత్రి కా ర్యాలయం నుంచి తాజా సమాచారం సేకరిస్తుంది.
కిట్ విశ్వవిద్యాలయం ప్రతిస్పందన
క్యాంపస్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని, ఈ సంఘటనపై కిట్ అధికారు లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్యాంపస్లో ఈ సంఘటనను గుర్తించిన వెంటనే, హాస్టల్ అధికారు లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారి సమక్షంలోనే విద్యార్థి మృత దేహాన్ని స్వాధీ నం చేసుకున్నారు. ఆమెను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తదనంతరం తదుపరి ప్రక్రియ ల కోసం మృతదేహాన్ని ఎయిమ్స్ భువనేశ్వర్కు తరలించారు.
నిజ నిర్ధారణ కమిటి
ఈ సంఘటనపై యూజీసీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఇగ్నో మాజీ వైస్ చాన్స్లర్ నాగే శ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో చైర్మన్తో పాటు 3 మంది సభ్యులు ఉంటారు. క్యాంపస్లో ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయో కమిటీ నిజ నిర్ధారణ చేస్తుంది. దర్యాప్తు ముగించి కమిటీ 10 రోజుల్లో నివేదికను సమర్పిస్తుంది.

కిట్ విశ్వవిద్యాలయ విద్యార్థిని మరణం