అరుదైన శస్త్ర చికిత్స | - | Sakshi
Sakshi News home page

అరుదైన శస్త్ర చికిత్స

May 2 2025 1:26 AM | Updated on May 2 2025 1:26 AM

అరుదై

అరుదైన శస్త్ర చికిత్స

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలో గురువారం అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గార మండలం అచ్చెన్నపాలెంకు చెందిన శిమ్మ నీలకంఠం వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్‌ 30న పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కటింగ్‌ మిషన్‌ చేయిమీదకు రావడంతో కుడిచేయి భాగం తెగిపోయింది. నరాలు తెగిపోవడం, ఎక్కువగా రక్తస్రావం జరగడంతో పనిచేయలేని స్థితికి వచ్చేసింది. విశాఖపట్నంలోని ఒక ఆస్పత్రిని సంప్రదిస్తే సుమారు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలుసుకున్నారు. దీంతో వెంటనే రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ డాక్టర్‌ బుల్లి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా అరుదైన ఆపరేషన్‌ను ఉచితంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ చేయడానికి సుమారు 5 గంటల సమయం వెచ్చించినట్లు ఆర్‌ఎంవో మేనేజర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

అరుదైన శస్త్ర చికిత్స 1
1/1

అరుదైన శస్త్ర చికిత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement