
గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన
కొరాపుట్: సహజసిద్ధ పుణ్య క్షేత్రం గుప్తేశ్వరంలో నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి పర్యటించారు. ఆదివారం ఉదయం కొరాపుట్ జిల్లా బొయిపరి గుడ సమితి రామగిరి పంచాయతీలో ఉన్న ఈ క్షేత్రం సందర్శించారు. అక్కడ జరుగుతున్న క్షేత్ర అభివృద్ధి పనుల పురోగతి సమీక్షించారు. సత్వరం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని దండకారణ్య కొండల్లో నివసిస్తున్న గిరిజనులకు ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేశారు. పర్యటనలో కొట్పాడ్ ఎమ్మెల్యే రుఫుదర్ బోత్ర, పార్టీ నాయకులు,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన

గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన