
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పర్లాకిమిడి: పాటికోట గ్రామానికి చెందిన శాసనం ఫాల్గుణ రావు (48) గురువారం ఉదయం గంజాం జిల్లా గోలంతర వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన పర్లాకిమిడి నుంచి భువనేశ్వర్కు సెంచూరియన్ వర్సిటీ పనిమీద వెళుతుండగా హైవే వద్ద కారుకు పెట్రోలు కొట్టించుకుని ఫోనులో మాట్లాడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయనకు బలమైన గాయాలు కావడంతో దగ్గరలో ఉన్న బరంపురం ఎం.కె.సి.జీ మెడికల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు ఐదుగురు అన్నదమ్ములు, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫాల్గుణ రావు మరణంతో పాటికోట గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన సెంచూరియన్ వర్సిటీ జనరల్ మేనేజర్ (అడ్మిషన్) విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన మృతికి సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, సిబ్బంది సంతాపం ప్రకటించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి