Top Stories
ప్రధాన వార్తలు
![Tdp,janasena Activists Attack On Jogi Ramesh House](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/jogi.jpg.webp?itok=5fYzpeHF)
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.తాజాగా, మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై జనసేన,టీడీపీ సానుభూతి పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు.
![Minister Darmendra Pradan Comments On Neet Paper Leak](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/darmendrapradan.jpg.webp?itok=z6mr2yC1)
నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రదాన్ కీలక కామెంట్స్
భువనేశ్వర్: ‘నీట్’పేపర్ లీక్ వ్యవహారంలో ఒకవేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులది తప్పని తేలితే వదిలేది లేదని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. ఆదివారం(జూన్16) ఒడిశాలోని సంబల్పూర్లో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పేపర్లీక్కు సంబంధించి రెండు చోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని పేరెంట్స్, తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నా. ఇందులో ఎంత పెద్దస్థాయి అధికారులున్నప్పటికీ వదిలేది లేదు. ఎన్టీఏలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. బిహార్ ఆర్థిక నేరాల విభాగం తొమ్మిది మంది నీట్ అభ్యర్థులకు పేపర్లీక్ కేసులో నోటీసులిచ్చింది. వారిని విచారణకోసం పిలిచాం’అని ప్రదాన్ తెలిపారు.
![Rahul Gandhi Joins EVM Debate After Elon Musk Tweet](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/rahul%20gandhi.jpg.webp?itok=2HKDo5OT)
ఈవీఎంల ట్యాంపరింగ్తో ఎన్నికల్లో విజయం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలోన్ మస్క్ చర్చకు తెర లేపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు, లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికి వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్లో పేర్కొన్నారు. భారత్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them. Serious concerns are being raised about transparency in our electoral process.Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024 దేశంలోని ఈవీఎంలను‘బ్లాక్ బాక్స్’అని అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్నిఉదహరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘భారత్లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు.మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసానికి గురవుతుందన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాల్ని ట్వీట్ చేశారు.ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ లోక్సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. అందుకు జూన్ 4న రెస్కో పోలింగ్ కౌంటింగ్ సెంటర్ బయట ఎంపీ రవీంద్ర వైకర్ బావ మంగేష్ పన్హాల్కర్ ఫోన్ వినియోగించారు. ఆ ఫోన్ వినియోగించడం వల్లే రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్కు మంగేష్ పన్హాల్కర్కు ఫోన్కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్లో ఓటీపీ సాయంతో కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్ ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగేష్ ఫన్హాల్కర్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజానిజాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈవీఎంలను నిషేధించాలంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాటిని ఎవరు కనెక్ట్ చేయలేరు. కనెక్టివిటీ లేదు, బ్లూటూత్, వైఫై,ఇంటర్నెట్ను వినియోగించలేరని అన్నారు.We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh— Elon Musk (@elonmusk) June 15, 2024
![Chalasani Srinivas Comments On TDP](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/challanisrinivas.jpg.webp?itok=epZhzcgu)
ప్రత్యేక హోదా వద్దన్నవారు దుర్మార్గులు: చలసాని శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: విభజన హామీలను వెంటనే అమలు చేయాలని.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నవారిని దుర్మార్గులుగా చూస్తామంటూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం.. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన హామీలు అమలైతేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.‘‘గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న వారు తాజాగా ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చారు. రాష్టం బాగుపడటం, భవిష్యత్ కూడా ముఖ్యమే. తెలుగు జాతి హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాంప్రమైజ్ కావొద్దు. ఏపీకి ప్రత్యేక హోదా తేవాలి. కేంద్రం నుంచి హామీలు తీసుకోవడం కాదు.. అమలయ్యేలా చూడాలి’’ అని చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.చంద్రబాబు, జనసేన విభజన అంశాలపై మాట్లాడలేదు.. నయనో, భయనో ప్రత్యేక హోదా తీసుకురావాలి.. పోలవరం పై కుట్ర జరుగుతుంది.. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు ఇవ్వాలి’’ అని చలసాని అన్నారు. ‘‘ఏపీలో మీడియాపై నిషేధం సరికాదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిషేధించిన ఛానల్స్ను పునరుద్ధరించాలి’’ చలసాని కోరారు.
![Congress Leader Urges Shah Rukh Khan to Visit His Ailing Teacher](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/ShahrukhKhan_01.jpg.webp?itok=LiVpvWd8)
చివరిసారిగా అడుగుతున్నా.. ఒక్కసారి వచ్చిపో షారూఖ్..
పాఠాలు నేర్పిన గురువు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. కానీ అభిమాని పేరు చెప్పగానే కదల్లేని స్థితిలో ఉన్న ఆయన కళ్లలో ఒక మెరుపు. అది చూసిన కాంగ్రెస్ లీడర్ సజరిత లైఫ్లాంగ్.. ఎలాగే ఆ శిష్యుడిని గురువు ముందు హాజరుపర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం అలాగైనా ఆయన ఆరోగ్య పరిస్థితిలో కాస్త మార్పు వస్తుందని భావిస్తున్నారు.క్షీణిస్తున్న ఆరోగ్యంఆ శిష్యుడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. షారూఖ్ గురువు ఎరిక్ డిసౌజ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ విషయాన్ని డిసౌజ సోదరి సజరిత లైఫ్లాంగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'నా సోదరుడు ఎరిక్ డిసౌజ హెల్త్ కండీషన్ దిగజారుతోంది. సరిగా మాట్లాడలేకపోతున్నాడు. ప్లీజ్ షారూఖ్.. ఒక్కసారి ఆయనను చూడటానికి రా.. క్షణాలు గడిచేకొద్దీ తనకేం జరుగుతుందోనని భయంగా ఉంది. ముంబై నుంచి గోవా రావడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. కొన్ని నిమిషాలు చాలుఒక అరగంటలో వచ్చేయొచ్చు. కేవలం కొన్ని నిమిషాల సమయం తన కోసం కేటాయించు. ఇప్పుడాయనకు మీరే ప్రపంచం. మీ రాక వల్ల తను కోలుకునే అవకాశం ఉంది. లేదంటే తన కళ్లముందు కమ్ముకున్న చీకటి నుంచి విముక్తి లభించి శాంతి చేకూరవచ్చు. చివరిసారిగా అడుగుతున్నాను.. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాను' అని అభ్యర్థించారు. షారూఖ్కు, ఎరిక్ డిసౌజకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఓ పాత వీడియోను సైతం షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు షారూఖ్.. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తన గురువును చూసేందుకు వెళ్లాలని కోరుతున్నారు. This feels like my final plea, my last attempt to reach out to @iamsrk to humbly request his presence by the side of Brother Eric S D'Souza. Each day, Brother 's health weakens, his condition worsening with every passing moment. Mumbai, just an hour away by flight, holds the… pic.twitter.com/9HaCjp5gLv— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 14, 2024 https://t.co/6QcjlFVvLj— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 15, 2024చదవండి: 'మహారాజ'.. విజయ్ సేతుపతి నన్ను తీసుకోవద్దన్నారు: నటి
![Infosys bags over USD 100 million deal from Ikea](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/infosys_0.jpg.webp?itok=1CF8Px0B)
మరో భారీ డీల్ను దక్కించుకున్న ఇన్ఫోసిస్
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పలు కొత్త ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. తాజాగా స్వీడన్ రిటైలర్ ఐకియా నుంచి 100 మిలియన్ డాలర్ల (రూ.850 కోట్లు) డీల్ను దక్కించుకుంది. హెచ్సీఎల్, క్యాప్ జెమినీ, డీఎక్స్సీ వంటి బడా కంపెనీలను దాటుకుని ఈ భారీ డీల్ను సొంతం చేసుకుంది.ఈ ఐదేళ్ల ఒప్పందం ప్రకారం.. ఇన్ఫోసిస్ 1,70,000 మంది ఉద్యోగులకు సర్వీస్ డెస్క్, సర్వీస్ నౌ ఆధారిత ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కన్జ్యూమర్, రిటైల్, లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్, ఈవీపీ కర్మేష్ వాస్వానీ ఈ డీల్కు నేతృత్వం వహించారు. గత ఏడాది ఐటీ దిగ్గజం డాన్స్కే బ్యాంక్ నుంచి 454 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకుంది.ఈ డీల్ కారణంగా చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, పోలాండ్, స్వీడన్, అమెరికా దేశాల్లో ఐకియాలో 350 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కు మారనున్నారు. కోల్డ్ కాలింగ్, కొన్ని ప్రారంభ కనెక్షన్లతో ప్రారంభమై వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముగిసిన మూడేళ్ల సుదీర్ఘ, సంతృప్తికరమైన ప్రయాణం అని ఇన్ఫోసిస్ కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్లో పేర్కొంది.
![Russian forces kill Islamic State-linked Hostage Takers](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/russia.jpg.webp?itok=5jE1cKF3)
రష్యా జైలులో ‘ఐసిస్’ కలకలం
మాస్కో: రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం సంచలనం రేపింది. ఈ షాకింగ్ ఘటనతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని నిర్బంధించిన ఖైదీల్లో కొందరిని అంతమొందించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలో ఉన్న ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్లో ఆరుగురు ఖైదీలు ఇద్దరు జైలు గార్డులను బందీలుగా పట్టుకున్నారు. ఆ ఖైదీలకు ఉగ్రవాదసంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు(ఐసిస్)తో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. వారి వద్ద మారణాయుధాలున్నట్లు అధికారులు తెలిపారు.ఖైదీల బారి నుంచి ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యా మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది ఖైదీలు మృతి చెందారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఈ ఏడాది మార్చిలో మాస్కోలోని ఓ మ్యూజిక్ కన్సర్ట్ హాల్పై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారు.
![India cricket teams record in T20 World Cup Super Eight](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/super8.jpg.webp?itok=EizVlmUN)
సూపర్-8కు సై.. టీమిండియాను భయపెడుతున్న గత రికార్డులు
టీ20 వరల్డ్కప్-2024లో గ్రూపు స్టేజీలో అదరగొట్టిన టీమిండియా.. ఇప్పుడు సూపర్-8 పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు గ్రూపు-ఎ నుంచి సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8 రౌండ్లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో భారత్ తలపడనుంది. ఇప్పటికే గ్రూపు-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, భారత్ తమ బెర్త్లు ఖారారు చేసుకోగా.. మరో బెర్త్ కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్-8లో భారత్ షెడ్యూల్ను ఓ సారి పరిశీలిద్దాం.టీ20 వరల్డ్ కప్ టీమిండియా సూపర్ 8 షెడ్యూల్జూన్ 20 : భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్, బ్రిడ్జ్టౌన్, బార్బడోస్జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆంటిగ్వాజూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, సెయింట్ లూసియాఅదే విధంగా టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో సూపర్-8లో టీమిండియా రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.సూపర్-8లో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే?టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సూపర్ 8, సూపర్ 10, సూపర్ 12 రౌండ్లలో మ్యాచ్లను నిర్వహిస్తుంటుంది. అయితే ఈ ఏడాది పొట్టి వరల్డ్కప్ను సూపర్ 8 రౌండ్లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. 12 సంవత్సరాల తర్వాత సూపర్-8 ఫార్మాట్ను ఐసీసీ తిరిగి మళ్లీ తీసుకువచ్చింది. చివరిగా 2012 టీ20 వరల్డ్కప్ సూపర్ ఎయిట్ ఫార్మాట్లో జరిగింది. సూపర్-8 ఫార్మాట్లో భారత జట్టు ట్రాక్ రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇప్పటి టీ20 వరల్డ్కప్ టోర్నీ సూపర్ 8లో 12 మ్యాచ్లు ఆడిన టీమిండియా.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించగా, ఎనిమిదింట ఓటమి పాలైంది. టీమిండియా విన్నింగ్ శాతం 33.3 శాతంగా ఉండగా.. ఓటమి శాతం 66.67% గా ఉంది.టీ20 వరల్డ్కప్-2007లో సూపర్-8లో మూడు మ్యాచ్లు ఆడిన భారత జట్టు రెండింట విజయం సాధించగా, ఒక్క మ్యాచ్లో ఓటమిపాలైంది. అదే విధంగా 2009, 2010 పొట్టి ప్రపంచకప్లో సూపర్-8లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది.ఆ తర్వాత 2012 వరల్డ్కప్లో రెండింట విజయం సాధించగా, ఒక్క మ్యాచ్లో ఓటమి చవిచూసింది. అయితే ఈ నాలుగు వరల్డ్కప్లలో కూడా భారత జట్టు ఎంఎస్ ధోని నాయకత్వంలోనే బరిలోకి దిగింది. 2007 వరల్డ్కప్ను ధోని సారథ్యంలోనే టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ 12 ఏళ్ల తర్వాత తొలిసారి సూపర్-8 ఫార్మాట్లో ఆడనుంది.
![Ktr Open Letter To Central Government On Neet Exam](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/KTR_1.jpg.webp?itok=rf-gtF9f)
‘నీట్’ అక్రమాలు.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయమై ఆయన ఆదివారం(జూన్16) కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఇప్పటికైనా నీట్ వ్యవహారంపై స్పందించాలన్నారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేసి వెంటనే బాధ్యులను శిక్షించాలని కోరారు. … pic.twitter.com/agUwEuiaG8— BRS Party (@BRSparty) June 16, 2024 కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఇంత ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.నీళ్ల కోసం ‘‘క్యూ సెరా.. సెరా’’భారతదేశంలో రాజకీయ విజయం అంటే నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు లాంటి వాస్తవ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం గురించి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. Political success in India is no more about the ability to solve real issues like water, electricity, roads, jobs and prices of essential commodities etc Where is the incentive for political parties to work on these real issues when elections are won on imaginary issues &… https://t.co/W8XYTqpZji— KTR (@KTRBRS) June 16, 2024ఊహాజనిత సమస్యలు & ఉత్పాదక అవగాహనలతో ఎన్నికలు గెలిచినప్పుడు ఈ వాస్తవ సమస్యలపై పని చేయడానికి రాజకీయ పార్టీలకు ప్రోత్సాహం ఎక్కడ ఉందన్నారు. వారు చెప్పినట్లు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నీళ్ల కోసం "క్యూ సెరా, సెరా"నే అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
![33 People Died due to Extreme Heat](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/heat-weather.jpg.webp?itok=xAlccBEF)
యూపీలో వడదెబ్బకు 33 మంది మృతి
ఉత్తరప్రదేశ్లో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం నాడు కాన్పూర్లో దేశంలోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాన్పూర్లో పగటి ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలుగా నమోదయ్యింది. రాత్రి 35.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 31 మంది మృతి చెందారు. సోమవారం వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కాన్పూర్, బుందేల్ఖండ్లో ఎండ వేడిమి కారణంగా శనివారం 20 మంది మృతిచెందారు.వీరిలో కాన్పూర్లో ఎనిమిది మంది, చిత్రకూట్లో ఆరుగురు, మహోబాలో ముగ్గురు, బందా, హమీర్పూర్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇదేవిధంగా వారణాసి పరిసర ప్రాంతాల్లో ఎండ వేడిమికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వారణాసిలో ఏడుగురు, బల్లియాలో ముగ్గురు, మీర్జాపూర్లో ఇద్దరు, ఘాజీపూర్, సోన్భద్రలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.జోనల్ వాతావరణ కేంద్రం సీనియర్ వాతావరణ నిపుణులు అతుల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాబోయే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు.
తప్పక చదవండి
- మొహంజోదారో : ఆ డ్యాన్సింగ్ గర్ల్ విగ్రహం ఎవరిది?
- టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు
- సినిమా కోసం అధిక వడ్డీకి అప్పులు.. దేశం విడిచి వెళ్లిపోలేదు: నటుడు
- T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!
- పెద్ద చదువు లేదు, ఉన్న ఇల్లమ్మేసింది, రూ.500 అప్పుతో..
- చెక్పోస్టు ఉద్యోగం భలే కిక్కు!
- ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే?
- టీడీపీ అరాచకం!
- నా భర్తతో హోటల్ రూమ్లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి
- వివాహేతర సంబంధం: భర్తను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భార్య
సినిమా
![Alia Bhatt Rare Childhood Pic And Full Details](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/alia-bhatt-rare-pic.jpg.webp?itok=a3Viv_c3)
చిన్న వయసులోనే స్టార్డమ్, నేషనల్ అవార్డ్.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈమె స్టార్ హీరోయిన్. టీనేజీలోనే హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ మూవీ హిట్. ఆ తర్వాత అద్భుతమైన నటనతో చాలా మూవీస్తో హిట్స్ కొట్టింది. తనకంటూ సెపరేట్ బ్రాండ్ సృష్టించుకుంది. పాన్ ఇండియా లెవల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న బూరె బుగ్గల చిన్నారి పేరు ఆలియా భట్. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో సీతగా నటించి, దక్షిణాదిలోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. తండ్రి మహేశ్ భట్ ప్రముఖ దర్శకుడు. తల్లిది బ్రిటన్. ఈమె నటి కూడా. ఫ్యామిలీది మూవీ బ్యాక్ గ్రౌండే కాబట్టి 19 ఏళ్లకే 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా అద్భుతమైన గుర్తింపు సంపాదించింది. 'గంగూబాయ్' సినిమాలో యాక్టింగ్ దెబ్బకు ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఇక ఆస్కార్ తెచ్చిపెట్టిన 'ఆర్ఆర్ఆర్'లోనూ చిన్న పాత్రలో కనిపించింది. ఇకపోతే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రితో తాను చిన్నప్పుడు ఉన్న ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. ఇందులో ఆలియాని చూసి ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఆలియా ఫ్యామిలీ విషయానికొస్తే.. హీరోయిన్గా ఫామ్లో ఉండగానే హీరో రణ్బీర్ కపూర్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు రహ అనే కూతురు కూడా ఉంది. ఇలా ఓ వైపు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో)
![Fardeen Khan Says Feroz Took Loans To Make Movies And Financial Troubles](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/fardeen-firox.jpg.webp?itok=HlrL-7Wv)
సినిమా కోసం అధిక వడ్డీకి అప్పులు.. దేశం విడిచి వెళ్లిపోలేదు: నటుడు
బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అతడు తన చిన్ననాటి సంగతులను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తండ్రి, స్టార్ హీరో ఫిరోజ్ ఖాన్ చేసిన పని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిపాడు. 'నాన్న హీరోగా ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. 1972లో అపర్ధ్ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ సమయంలో నిర్మాతలు అధిక వడ్డీకి అప్పు తీసుకుని చిత్రాలు చేసేవారు. నాన్న కూడా అలానే చేశాడు. అది చూసి మేమంతా భయపడ్డాం.ఆర్థిక ఇబ్బందులుతర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టార్ హీరో కుమారుడిని అని గల్లా ఎగరేసి చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. మా అమ్మ ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ అటెండెంట్గా 9 సంవత్సరాలు పని చేసింది. అమ్మానాన్న ఇద్దరూ మాకోసం కష్టపడేవారు. ప్రతి ఏడాది లాంగ్ వెకేషన్కు తీసుకువెళ్లేవారు. కొన్నిసార్లు ఆ వెకేషన్ కూడా ఆపేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బర్త్డే పార్టీ కూడా చిన్నగా జరిపేవారు. అలా అని తినడానికి తిండి లేనంత దీన స్థితిలోనైతే లేము అని పేర్కొన్నాడు.దేశం విడిచి పారిపోలేదుఇండస్ట్రీకి 14 ఏండ్లు దూరంగా ఉండటంపై స్పందిస్తూ.. నేను సినిమాలకు దూరంగా ఉన్నమాట వాస్తవమే.. కానీ దేశం విడిచి వెళ్లిపోలేదు. కొన్నాళ్లపాటు అక్కడ ఉండి మళ్లీ ఇండియాకు వచ్చేశాను.. ఇక్కడే ఉన్నాను. కొన్నేళ్ల క్రితం నేను కాస్త లావయ్యాను. నా అవతారం చూసి సినిమాలు పూర్తిగా మానేసినట్లున్నాడని అంతా అనుకున్నారు. నిజంగా 14 ఏళ్లు మూవీస్కు దూరంగా ఉండటం నేను చేసిన అతిపెద్ద పొరపాటు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫర్దీన్ ఖేల్ ఖేల్ మే, విస్ఫోట్ సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో
![Klin Kaara With Ram Charan, Father's Day Special Pic](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/ram-charan-klin-kaara-.jpg.webp?itok=Fr_SFWNb)
ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో
మెగా హీరో రామ్ చరణ్ నుంచి ఫాదర్స్ డే స్పెషల్ ఫొటో వచ్చేసింది. ఇప్పటికే కూతురు క్లీంకార బుడిబుడి అడుగులు వేస్తుండగా.. తాజాగా ఆమెని ఎత్తుకుని, అలా గాల్లోకి ఎగరేస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూస్తుంటే చరణ్- క్లీంకార మధ్య బాండింగ్ చూస్తుంటే మచ్చటేస్తోంది.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)2012లో రామ్ చరణ్కి పెళ్లవగా.. గతేడాది జూన్లో కూతురు పుట్టింది. ఈమెకు క్లీంకార అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇప్పటివరకు ముఖాన్ని చూపించకుండా దాచేశారు. సైడ్ లేదా బ్యాక్ నుంచి తీసిన కొన్ని ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అలా ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా చరణ్-క్లీంకార ఫొటో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్కి తెగ నచ్చేస్తోంది.(ఇదీ చదవండి: ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్)
![Actor Vishwak Sen Pledges To Donate His Organs](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/vishwak-sen-organ-donation.jpg.webp?itok=HEKgzzrQ)
ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లెక్కకు మించి హీరోలు వస్తున్నారు. వీళ్లలో తమదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. యాటిట్యూడ్ కామెంట్స్ వల్ల అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు గానీ మంచి యాక్టర్. ఇప్పుడు అంతకు మించిన మంచి పని చేసి శెభాష్ అనిపించుకున్నాడు.(ఇదీ చదవండిు: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)తాజాగా హైదరాబాద్లో 'మెట్రో రెట్రో' పేరుతో అవయవ దానంకి సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన విశ్వక్.. తాను కూడా అవయవ దానం చేస్తానని అన్నాడు. ఈ మేకరు తన వివరాలు ఇచ్చాడు. మిగతా తెలుగు హీరోలు కూడా విశ్వక్ సేన్లా ముందుకొస్తే, అభిమానులు కూడా తమ వంతుగా డోనర్స్ అవుతారు.రీసెంట్గా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన విశ్వక్ సేన్.. ప్రస్తుతం 'మెకానిక్ రాకీ' మూవీ చేస్తున్నాడు. రీసెంట్గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్తో పాటు ఇతర వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండిు: ఓటీటీలో ఇలియానా బోల్డ్ అండ్ కామెడీ సినిమా)
క్రీడలు
![India cricket teams record in T20 World Cup Super Eight](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/super8.jpg.webp?itok=EizVlmUN)
సూపర్-8కు సై.. టీమిండియాను భయపెడుతున్న గత రికార్డులు
టీ20 వరల్డ్కప్-2024లో గ్రూపు స్టేజీలో అదరగొట్టిన టీమిండియా.. ఇప్పుడు సూపర్-8 పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు గ్రూపు-ఎ నుంచి సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8 రౌండ్లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో భారత్ తలపడనుంది. ఇప్పటికే గ్రూపు-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, భారత్ తమ బెర్త్లు ఖారారు చేసుకోగా.. మరో బెర్త్ కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్-8లో భారత్ షెడ్యూల్ను ఓ సారి పరిశీలిద్దాం.టీ20 వరల్డ్ కప్ టీమిండియా సూపర్ 8 షెడ్యూల్జూన్ 20 : భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్, బ్రిడ్జ్టౌన్, బార్బడోస్జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆంటిగ్వాజూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, సెయింట్ లూసియాఅదే విధంగా టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో సూపర్-8లో టీమిండియా రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.సూపర్-8లో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే?టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సూపర్ 8, సూపర్ 10, సూపర్ 12 రౌండ్లలో మ్యాచ్లను నిర్వహిస్తుంటుంది. అయితే ఈ ఏడాది పొట్టి వరల్డ్కప్ను సూపర్ 8 రౌండ్లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. 12 సంవత్సరాల తర్వాత సూపర్-8 ఫార్మాట్ను ఐసీసీ తిరిగి మళ్లీ తీసుకువచ్చింది. చివరిగా 2012 టీ20 వరల్డ్కప్ సూపర్ ఎయిట్ ఫార్మాట్లో జరిగింది. సూపర్-8 ఫార్మాట్లో భారత జట్టు ట్రాక్ రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇప్పటి టీ20 వరల్డ్కప్ టోర్నీ సూపర్ 8లో 12 మ్యాచ్లు ఆడిన టీమిండియా.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించగా, ఎనిమిదింట ఓటమి పాలైంది. టీమిండియా విన్నింగ్ శాతం 33.3 శాతంగా ఉండగా.. ఓటమి శాతం 66.67% గా ఉంది.టీ20 వరల్డ్కప్-2007లో సూపర్-8లో మూడు మ్యాచ్లు ఆడిన భారత జట్టు రెండింట విజయం సాధించగా, ఒక్క మ్యాచ్లో ఓటమిపాలైంది. అదే విధంగా 2009, 2010 పొట్టి ప్రపంచకప్లో సూపర్-8లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది.ఆ తర్వాత 2012 వరల్డ్కప్లో రెండింట విజయం సాధించగా, ఒక్క మ్యాచ్లో ఓటమి చవిచూసింది. అయితే ఈ నాలుగు వరల్డ్కప్లలో కూడా భారత జట్టు ఎంఎస్ ధోని నాయకత్వంలోనే బరిలోకి దిగింది. 2007 వరల్డ్కప్ను ధోని సారథ్యంలోనే టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ 12 ఏళ్ల తర్వాత తొలిసారి సూపర్-8 ఫార్మాట్లో ఆడనుంది.
![Smriti Mandhana Brings Up Her Sixth ODI Century In Bengaluru](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/Smriti-Mandhana.jpg.webp?itok=j6exeb_0)
సెంచరీతో చెలరేగిన మంధాన.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్
చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ను మంధాన తన విరోచిత సెంచరీతో ఆదుకుంది. ఈ మ్యాచ్లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 117 పరుగులు చేసింది. స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్(31 నాటౌట్) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్ రెండు, డెకరసన్, మల్బా, షాంగసే తలా వికెట్ సాధించారు.మంధాన అరుదైన రికార్డుఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన మంధాన ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా స్మృతి(6 సెంచరీలు) రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో హర్మన్ ప్రీత్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(7) ఉంది.
![Namibia's Nikolaas Davin achieves this Rare feat in T20 World Cup](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/namibia.jpg.webp?itok=gZ4MpwdK)
నమీబియా ఓపెనర్ అరుదైన ఫీట్.. టీ20 వరల్డ్కప్ చరిత్రలోనే
నమీబియా ఓపెనర్ నికోలాస్ డేవిన్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా డేవిన్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా శనివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన డేవిన్.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అనంతరం 123 పరుగుల లక్ష్యచేధనలో నమీబియా ఓపెనర్గా వచ్చిన డేవిన్ తడబడ్డాడు. ఇంగ్లీష్ పేసర్లను ఎదుర్కొనేందుకు డేవిన్ తీవ్రంగా శ్రమించాడు. తన ఆడిన 16 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్.. డెవిన్ వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో డెవిన్ రిటైర్ట్ ఔట్గా డగౌట్కు చేరాడు. అతడి తన స్ధానంలో డేవిడ్ వైస్ క్రీజులోకి వచ్చాడు. అయితే 17 ఏళ్ల టీ20 వరల్డ్కప్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇలా రిటైర్డ్ అవుట్గా వెనుదిరగలేదు. ఇక ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నమీబియాపై 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.
![Harbhajan Singh's Blunt Take On Why India Star Is Yet To Fire At T20 World Cup](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/WhatsApp%20Image%202024-06-16%20at%2016.24.52.jpeg.webp?itok=s2e0jBfA)
తప్పు విరాట్ కోహ్లిది కాదు.. పిచ్ది: హర్భజన్ సింగ్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కనుబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విరాట్ దారుణంగా విఫలమయ్యాడు.మొత్తంగా కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్-2024లో టాప్ రన్ స్కోరర్గా నిలిచిన విరాట్.. పొట్టి ప్రపంచకప్లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.దీంతో కొంతమంది పాక్ మాజీ ఆటగాళ్లు విరాట్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లిది ఎటువంటి తప్పులేని, న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ అస్సలు బ్యాటింగ్కు అకుకూలించలేదని భజ్జీ చెప్పుకొచ్చాడు."న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆ వికెట్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు.అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్లను ఆశిస్తోంది. అంతేకాకుండా ఓపెనర్గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆ వికెట్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్లను ఆశిస్తోంది. అంతేకాకుండా ఓపెనర్గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. తొలి 6 ఓవర్లలో రోహిత్, విరాట్ మంచి ఆరంభాలను ఇస్తే.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే వంటి వారు తమపని తాము చేసుకుపోతారని" స్టార్స్పోర్ట్స్తో హర్భజన్ పేర్కొన్నాడు.
బిజినెస్
![Success Story Of Krishna Yadav Who Became A Millionaire With Pickle Business](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/modi_9.jpg.webp?itok=K9x_Mfty)
పెద్ద చదువు లేదు, ఉన్న ఇల్లమ్మేసింది, రూ.500 అప్పుతో..
బాగుపడాలంటే.. బాధ్యత ఉంటే చాలంటారు. చేసేపనిలో నిబద్దత కనపరిస్తే కొంత ఆలస్యమయినా సక్సెస్ సాధించవచ్చు. విజయం సాధించాలంటే ఉన్నత చదువులే తప్పనిసరి కాదని ఓ మహిళ నిరూపించింది. కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి.. నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సక్సెస్ స్టోరీ ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన 'కృష్ణ యాదవ్' ఉన్నత చదువులు చదువుకోలేదు, పైగా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. 1990లలో ఈమె భర్త వ్యాపారం దివాళా తీయడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉన్న ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. ఆ తరువాత స్నేహితుల వద్ద 500 రూపాయలు అప్పు తీసుకుని బులంద్షహర్ వదిలి ఢిల్లీకి వెళ్లారు.ఢిల్లీకి వెళ్లిన తరువాత తన భర్తకు ఉద్యోగం లభించలేదు. ఆ తరువాత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయం చేసి కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. సాగు చేసిన కూరగాయలను సరిగ్గా అమ్ముకోలేకపోయారు. ఆ తరువాత ఊరగాయలు తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకుని, దీనికోసం ఢిల్లీలోని ఉజ్వా గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కృష్ణ యాదవ్ శిక్షణ తీసుకున్నారు.ఊరగాయలు తయారు చేయడానికి మొదట్లో రూ. 3000 పెట్టుబడి పెట్టారు. వీటిని ఆమె భర్త మొదట్లో రోడ్డు పక్కన విక్రయించడం ప్రారంభించారు. ఇదే క్రమంగా పెరిగి 'శ్రీ కృష్ణ పికిల్స్' సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం వీరు 150 రకాల ఊరగాయలు విక్రయిస్తున్నట్లు సమాచారం.కృష్ణ యాదవ్ తాను ఎదగడమే కాకుండా.. ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈమె టర్నోవర్ రూ.5 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. వ్యాపార రంగంలో దినదిన ప్రవర్తమానం చెందిన కృష్ణ యాదవ్ కృషికి భారత భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2015లో నారీ శక్తీ సమ్మాన్ పురష్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందజేశారు.
![Today Gold and Silver Price 16 June 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/gold-price-today.jpg.webp?itok=rkg7IdiB)
బంగారం, వెండి ధరలు: ఈ రోజు ఎలా ఉన్నాయో తెలుసా?
జూన్ ప్రారంభం నుంచి పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న రూ. 660 తగ్గిన బంగారం ధరలు నేడు (జూన్ 16) ఉలుకు పలుకు లేకుండా ఉన్నట్లు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66500 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.72550 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72700 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం, 24 క్యారెట్స్ గోల్డ్ ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 67050 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73150 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. దీంతో ఈ రోజు (జూన్ 16) ఒక కేజీ వెండి ధర రూ. 91000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఇది బంగారం, వెండి కొనేవారికి శుభవార్త అనే చెప్పాలి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
![Elon Musk Tweet About EVM](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/elon-musk_1.jpg.webp?itok=d7qRGrFp)
ఈవీఎంలు రద్దు చేయాలి: మస్క్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచంలోని చాలాదేశాల్లో ఓటింగ్ ప్రక్రియకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) ఉపయోగిస్తున్నారు. దీనిపైన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఇటీవల ప్యూర్టో రికో దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో అవకతవకలు జరిగాయని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వందల కొద్దీ ఓటింగ్ అక్రమాలను ఎదుర్కొన్నట్లు వివరాయించారు. అదృష్టవశాత్తూ, పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్ళీ పేపర్ బ్యాలెట్లకు తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు.రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ ట్వీట్ మీద మస్క్ స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలి. వీటిని ఎవరైనా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ఒక దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంటుందని మస్క్ అన్నారు.మస్క్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మస్క్ అబ్రిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తున్నారు. నిజానికి ఈవీఎంలో ఎంత సేఫ్టీ టెక్నాలజీలను ఉపయోగించి తయారు చేసినా.. అంతకు మించిన టెక్నాలజీతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నికల విషయంలో పేపర్ ఓటింగ్ ఉత్తమం అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh— Elon Musk (@elonmusk) June 15, 2024
![When Northrop Grumman Manta Ray Prototype Video](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/manta-ray.jpg.webp?itok=vKfBfRJQ)
చేప కాదు కానీ.. నీటిలో దిగితే తక్కువా కాదు
వాహన ప్రపంచంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హోవర్క్రాఫ్ట్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది భూమి మీద మాత్రమే కాకుండా నీటిలో, గాలిలో కూడా పయనించగలదు. అయితే ఇప్పుడు 'నార్త్రోప్ గ్రుమ్మన్' (Northrop Grumman) అంతర్గత జలాలలో (నీటి లోపల) ప్రయాణించే ఓ సరికొత్త 'రోబోటిక్ మంటా రే సబ్మెర్సిబుల్' గురించి వెల్లడించింది.'రోబోటిక్ మంటా రే సబ్మెర్సిబుల్'కు సంబంధించిన వీడియోలో గమనించినట్లయితే.. ఇది వేగంగా నీటిలోపల వెళ్లడం చూడవచ్చు. చూడటానికి ఓ చేప ఆకారంలో ఉండే ఈ వెహికల్ రెండు కన్నుల వంటి నిర్మాణం, రెక్కలు వంటి వాటిని కూడా పొందుతుంది. నీటిలో సులభంగా ముందుకు వెళ్ళడానికి చేపవంటి నిర్మాణంలో దీన్ని తయారు చేసినట్లు భావిస్తున్నాము.నార్త్రోప్ గ్రుమ్మన్.. తన మాంటా రే ప్రోటోటైప్ను ఈ ఏడాది పరీక్షించింది. లాంగ్ రేంజ్, లాంగ్ డ్యూరేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ ప్రత్యేకమైన వాహనాన్ని నిమించడానికి ఏకంగా నాలుగు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ వాహనాన్ని 'ఎక్స్ట్రా లార్జ్ అన్క్రూడ్ అండర్ వాటర్ వెహికల్' అని పిలుస్తారు. దీనిని DARPA అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని తయారు చేశారు.తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. అంతే కాకుండా ఎక్కువ బరువును తీసుకెళ్లే కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఇది పైకి, కిందికి గ్లైడింగ్ చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ టెక్నాలజీ ఈ వాహనాన్ని మరింత వేగంగా ముందుకు వెళ్లేలా చేస్తుంది. ఇది సముద్రం అడుగు భాగంలో కూడా ప్రయాణించగలదు.
వీడియోలు
![Elon Musk Sensational Tweet On To Cancel EVMs](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/30.png.webp?itok=TAcEt4F4)
![Elon Musk Sensational Tweet On To Cancel EVMs](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/30.png.webp?itok=TAcEt4F4)
ఈవీఎంలు రద్దు చేయాలంటూ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
![BJP Senior Leader Laxman Sensational Comments On Ex CM KCR Power Scam](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/29.png.webp?itok=QPTaPh7D)
![BJP Senior Leader Laxman Sensational Comments On Ex CM KCR Power Scam](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/29.png.webp?itok=QPTaPh7D)
కేసీఆర్ పై చర్యలేవి ?
![BRS Leader Jagadish Reddy About KCR Latter To Power Commission](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/27.png.webp?itok=YQQhIcFR)
![BRS Leader Jagadish Reddy About KCR Latter To Power Commission](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/27.png.webp?itok=YQQhIcFR)
కేసీఆర్ లెటర్ పై జగదీష్ రెడ్డి రియాక్షన్
![Actress Sangeetha Launches Andro Max In Ferty9 Fertility Center In Secunderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/26.png.webp?itok=SXbVohIu)
![Actress Sangeetha Launches Andro Max In Ferty9 Fertility Center In Secunderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/26.png.webp?itok=SXbVohIu)
పురుషుల వంధ్యత్వ సమస్యను పరిష్కరించే ఆండ్రోమాక్స్ ప్రారంభం
![Rayadurgam Bike Racers Arrest](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/25.png.webp?itok=_0rqN-a6)
![Rayadurgam Bike Racers Arrest](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/25.png.webp?itok=_0rqN-a6)
బైక్ రేసర్ల హల్ చల్
![Chalasani Srinivas Press Meet](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/24.png.webp?itok=PGHJDwNq)
![Chalasani Srinivas Press Meet](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/24.png.webp?itok=PGHJDwNq)
విభజన హామీలను వెంటనే అమలు చేయాలి
![Editor Comment On Nara Lokesh Red Book](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/22.png.webp?itok=kxgcLKU4)
![Editor Comment On Nara Lokesh Red Book](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/22.png.webp?itok=kxgcLKU4)
ఎక్కడా తగ్గని రెడ్ బుక్.. బీభత్స పాలన
![All Arrangements Set For Bonalu Festival](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/21.png.webp?itok=d2eH9XOm)
![All Arrangements Set For Bonalu Festival](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/21.png.webp?itok=d2eH9XOm)
జులై-7 నుంచి తెలంగాణ బోనాలు
![Registration Department Study Land Rates In Telangana](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/20.png.webp?itok=hXhMBI0r)
![Registration Department Study Land Rates In Telangana](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/20.png.webp?itok=hXhMBI0r)
భూములకు కొత్త విలువ
![Heavy Que Lines for Dharsan](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/19.png.webp?itok=vaoEuOXK)
![Heavy Que Lines for Dharsan](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/19.png.webp?itok=vaoEuOXK)
తిరుమలకు పోటెత్తిన భక్తులు
ఫ్యామిలీ
![Shraddha Kapoor's Rs 31500 Floral Red Saree For Stree 2 Teaser Launch](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/saree.jpg.webp?itok=kMr_oHdY)
పండెరుపు చీరలో శ్రద్ధా స్టన్నింగ్ లుక్..ధర ఎంతంటే!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రద్ధా కపూర్ టీన్ పట్టి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయింది. అయితే ఆషికీ-2 సినిమాతోనే శ్రద్ధా కపూర్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ నటనకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇప్పుడు శ్రద్ధా స్ట్రీ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రద్ధా సంప్రదాయ చీరలో తళుక్కమంది. ఈ చీర ఆమె ఫ్యాషన్ శైలి ఏంటో చెప్పకనే చెప్పింది. ఆమె పూల మొక్కలతో కూడిన పండెరుపు చీరలో శ్రద్ధా ఎర్ర గులాబీలా అందంగా కనిపించింది.ఆ చీరకు తగ్గట్టు గోల్డెన్ బ్యాంగిల్స్, చక్కటి చెవిపోగులు, స్లీవ్ లెస్ బ్లౌజ్, సింపుల్ మ్యాకప్తో మరింతో అందంగా కనిపించిది. ఈ చీరను డిజైనర్ ధృవ్ పంచల్ తీర్చిదిద్దారు. దీని ధర ఏకంగా రూ. 31,500/-. శ్రద్ధా ఇలా చీరలో ఇంతకుమునుపు కూడా సందడి చేసింది. ప్రతి చీర ఆమె స్కిన్ టోన్కి తగ్గట్లుగా ఎంపిక చేసుకుంటుంది. తన లుక్ అందంగా కనిపించేలా సింపుల్ మేకప్కే ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఆమె నట్టించిన స్ట్రీ2 మూవీ వచ్చే నెల ఆగస్ట 15 థియోటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తన మూవీ ప్రమోషనల్ సందడి చేసేలా తన లుక్స్ పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది శ్రద్ధా.. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)(చదవండి: స్లిమ్గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!)
![Vidya Balan's Weight Loss Transformation Inspiring For Many](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/vidya_0.jpg.webp?itok=qxK5058c)
స్లిమ్గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. కొన్నాళ్లు కాస్తా బొద్దుగా తయారయ్యి..సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలారోజుల తర్వాత బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ మూవీ ప్రదర్శనకు హాజరైన విద్యాబాలన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా ఆమె లుక్ అంతా మారిపోవడంతో..ఇంతలా స్లిమ్గానా అంటూ.. అందరి చూపులు ఆమెపైనే. చెప్పాలంటే ఈ కార్యక్రమంలో విద్యాబాలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడంతా విద్య నాజుగ్గా మారడమే హాట్టాపిక్గా మారింది. ఈ కార్యక్రమంలో విద్య సోదరి కుమారుడు కూడా వచ్చాడు. ఆమె బ్లాక్ డ్రస్లో ఓ రేంజ్ స్టన్నింగ్ లుక్తో కనిపించింది. గోల్డెన్ కలర్ చెవుపోగులు, లైట్ మేకప్తో గ్లామరస్గా ఉంది. అంతేగాదు ఫిట్గా ఉండాలని కోరుకునేవారికి స్ఫూర్తిగా ఉంది విద్య. మల్లెతీగలా కనిసిప్తున్న ఈ బ్యూటీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని ఆరాతీస్తున్నారు. అయితే విద్య అంతలా స్లిమ్ అవ్వడానికి ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే..ప్రతి రోజు వ్యాయమం చేసే అవకాశం లేకపోయిన కనీసం రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్ వంటివి చేయడంకూల్డ్రింగ్స్, అధిక చక్కెర గల పళ్ల రసాలతో సహా టీ, కాఫీలకు దూరంగా ఉండటంరోజంతా హైడ్రేషన్గా ఉండేలా నీళ్లు బాగా తాగేదని, ఇది ఆకలిని కంట్రోల్ చేసేందుకు ఉపకరించిందని వ్యక్తిగత ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజుకి ఏడు నుంచి తొమ్మిది గంటలు మంచిగా నిద్రపోవడం. నాణ్యమైన నిద్ర ఉంటే ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినడం వంటివి చేయాలి. దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది. టీవీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లుకు దూరంగా ఉండటం వంటివి చేస్తే..ఎవ్వరైనా..ఇట్టే బరువు తగ్గిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చెయ్యండి.(చదవండి: చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?)
![National Fisheries Development Board Fish Shape Building In Hyderabad, India](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/Fish1.jpg.webp?itok=4hltftc5)
చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?
కనస్ట్రక్షన్కి టెక్నాలజీ కూడా తోడవ్వడంతో విభిన్న ఆకృతిలో భవనాలను నిర్మిస్తున్నారు అధికారులు. అవి నగరానకి స్పెషల్ ఐకాన్గా నిలిస్తున్నాయి. అబ్బా ఎలా నిర్మించారు దీన్ని అని ఆశ్చరయపోయేలా వాటిని నిర్మిస్తున్నారు. అలానే చేప ఆకృతిలో భవనాన్ని నిర్మించి వాటే ఏ బిల్డింగ్ ఇది అను ముక్కునవేలేసుకునేలా చేశారు నిర్మాణకారులు. ఎక్కడుందంటే ఈ భవనం..?ఈ ఫిష్ బిల్డింగ్ హైదరబాద్ ఉంది. దీన్ని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయంగా చేప ఆకృతిలో నిర్మించారు. స్థానికంగా దీన్ని ఫిష్ బిల్డింగ్ అనిపిలుస్తారు. ఈ బిల్డింగ్కి స్ఫూర్తి..1992లో పూర్తి అయిన బార్సిలోనా ఫ్రాంక్ గెహ్రీ స్మారక ఫిష్ శిల్పం. దాన్ని చూసి ఇలా చేప ఆకారంలో బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. ఈ భవనం మిమెటిక్ ఆర్కిటెక్చర్కు ఒక ఉదాహరణ. చేప రూపంలో మొత్తం బిల్డింగ్ కార్యచరణ అంశాలను కలుపుతుంది. దీని ప్రవేశ ద్వారం రెండు మెట్లపై ఉన్న గుడారంలా ఉంటుంది. రెండు వృత్తాకరా అద్దాలు చేప కళ్లులా కనిపిస్తాయి. మొత్తం భవనం స్టెయిన్లెస్ స్టీల్తో కప్పబడి, మధ్యలో నీలిరంగు స్పెషల్ ఎట్రాక్షన్గా ఉంటుంది. అంతేగాదు ఆ బిల్డింగ్కి ఉన్న బ్లూ-పర్పుల్ స్పాట్లైట్లు రాత్రిపూట భవనాన్ని ప్రకాశించేలా చేస్తాయి. చూడటానికి ఈ ఫిష్ బిల్డింగ్ ఓ'జెయింట్ ఫిష్' హైదరాబాద్లో ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది.(చదవండి: రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్గా..రీజన్ వింటే షాకవ్వుతారు!)
![These Are The New Devices That Change According To The Weather](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/55555.jpg.webp?itok=Rvs5_B2-)
వాతావరణానికనుగుణంగా.. ఉపయోగపడే కొత్త పరికరాలు ఇవే..!
ఈ ఫొటోలోని ఇంటెలిజెంట్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ పొద్దుపొద్దున్నే చాలా వెరైటీలను అందిస్తుంది. స్మార్ట్ టెంపరేచర్ కంట్రోల్తో క్వాలిటీ మెటీరియల్తో రూపొందిన ఈ మేకర్లో పోచ్డ్ ఎగ్స్, గుంత పొంగనాలు, కుడుములు, పాన్ కేక్స్, గ్రిల్ ఐటమ్స్ వంటివి చాలానే రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైస్తో పాటు రెండుమూడు రకాల పాన్ ప్లేట్స్ లభిస్తుంటాయి.అవసరాన్ని బట్టి వాటిని మార్చుకుంటూ ఎన్నో వెరైటీలను తయారు చేసుకోవచ్చు. ఒకవైపు గుంతలు, మరోవైపు పాన్ ప్లేట్ లేదా మొత్తం బాల్స్ పాన్, లేదంటే మొత్తం కట్లెట్స్ పాన్.. ఇలా అటాచ్డ్ గ్రిల్ ప్లేట్స్ మెషి¯Œ తో పాటు లభించడంతో దీనిపై వంట సులభమవుతుంది. ఫైర్ప్రూఫ్, హీట్ రెసిస్టెంట్ షెల్ హీట్ ఇన్సులేషన్తో తయారైన ఈ మేకర్ను సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే అటాచ్డ్ పాన్ లేదా గ్రిల్ ప్లేట్స్ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.వైఫై ఎనేబుల్డ్ కాఫీ మేకర్..ఈ స్టైలిష్ కాఫీ మేకర్తో వివిధ రకాల కాఫీ ప్లేవర్స్ని ఎంజాయ్ చేయవచ్చు. బ్లాక్ కాఫీ, క్యాపుచినో, లాటె, ఎస్ప్రెస్సో, రిస్ట్రెట్టో వంటి చాలా ప్లేవర్స్ ఇందులో రెడీ చేసుకోవచ్చు. అవర్స్, మినిట్స్, పవర్, టెంపరేచర్, మగ్, కప్స్ వంటి ఆప్షన్స్తో డివైస్ ముందు వైపు కింద డిస్ ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. దీన్ని వైఫై సాయంతో స్మార్ట్ ఫో¯Œ కి కనెక్ట్ చేసుకుని కూడా సులభంగా వినియోగించుకోవచ్చు.6 అడ్జస్టబుల్ గ్రైండ్ సెట్టింగులతో రూపొందిన ఈ మేకర్ని యూజ్ చేసుకోవడం చాలా ఈజీ. సర్వ్ చేసుకోవడం తేలిక. అలాగే ఈ డివైస్కి ఎడమవైపు వాటర్ ట్యాంక్ ఉంటుంది. దానిలో నీళ్లు నింపుకుని, కుడివైపు పైభాగంలో మూత తీసి.. కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్ వేసుకుని పవర్ బటన్ నొక్కితే చాలు. టేస్టీ కాఫీ రెడీ అయిపోతుంది. ఇందులో ఒకేసారి నాలుగు నుంచి పది కప్పుల వరకూ కాఫీని రెడీ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.హాట్– కోల్డ్ బ్లెండర్..గ్రెయిన్, పేస్ట్, టీ, జ్యూస్, క్లీన్ అనే ఐదు ఆప్షన్స్తో రూపొందిన ఈ హాట్– కోల్డ్ బ్లెండర్ వినియోగదారులకు సౌకర్యవంతమైన మిక్సీలా పని చేస్తుంది. దీనిలో నూక, పిండి తయారు చేసుకోవడంతో పాటు జ్యూసులు, మిల్క్ షేక్స్ వంటివి వేగంగా రెడీ చేసుకోవచ్చు. సుమారు 25 నిమిషాల వ్యవధిలో ఫిల్టర్తో పని లేకుండా ఒకేసారి 2 కప్పులు సోయా పాలను సిద్ధం చేసుకోవచ్చు.దీనిలో పదునైన మిక్సింగ్ నైవ్స్ బ్లేడ్స్లా ఉంటాయి. ఈ జ్యూసర్లో 12 అవర్స్ ప్రీసెట్ ఆప్ష¯Œ తో పాటు వన్ అవర్ కీప్ వార్మర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఒకరికి లేదా ఇద్దరికి అనువైనది. దీనిలో ఆటోమేటిక్ క్లీనింగ్ ఆప్షన్ ఉండటంతో. దీని వాడకం చాలా తేలికగా ఉంటుంది. పైగా ఇది తక్కువ శబ్దంతో పని చేస్తుంది.
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
మీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు, ‘విద్యుత్’ కమిషన్ నుంచి వైదొలగండి.. జస్టిస్ నరసింహారెడ్డికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేద్దాం... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులకు బిగుస్తున్న ఉచ్చు... ఏసీబీతో పాటు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం... 24 మందితో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు.. విద్యుత్ రంగ నిర్ణయాల్లో పాత్రపై జారీ చేసినట్లు జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధాని కార్యాలయం మోదీ పీఎంవో కాదు, అది ప్రజా పీఎంవో అని మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![Shops and houses of YSRCP leaders were destroyed](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/attack_1.jpg.webp?itok=d-Zuwq4z)
వైఎస్సార్సీపీ నేతల దుకాణాలు, ఇళ్లు ధ్వంసం
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరుల ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. అజిత్సింగ్నగర్లో వైఎస్సార్సీపీ కార్యకర్త జహీర్బాషాకు చెందిన టైలరింగ్ దుకాణాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కుట్టుమెషిన్లు, ఎల్ఈడీ టీవీ, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి శివారెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు రువ్వు శివారెడ్డిని దుర్భాషలాడారు. ఇటీవల వైఎస్సార్సీపీలో చేరి ఎన్నికల్లో పనిచేసిన నగర మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణ కారు అద్ధాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిపై ఏకంగా దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో సామగ్రి దహనంవెల్దుర్తి: వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన రెండు గృహాలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడి ఇళ్లల్లోని సామగ్రిని దహనం చేసిన ఘటన పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిన్నెబోయిన బాలగురవయ్య యాదవ్, పల్లపాటి వీరనారాయణ యాదవ్ గృహాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులుగా వచ్చి దాడి చేశారు. ఆ రెండు గృహాల్లో ఉన్న విలువైన సామగ్రి, పత్రాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. టీడీపీ శ్రేణులు దాడులు చేస్తారనే భయంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఊరు వదిలి వెళ్లిపోగా.. మహిళలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ శ్రేణులు ఆ రెండు ఇళ్లపై దాడులకు పాల్పడి మొత్తం సామగ్రిని దహనం చేశారు. రూ.10 లక్షల విలువైన వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేతఆక్రమణల నెపంతో విజయవాడలో టౌన్ప్లానింగ్ అధికారుల హడావుడిపాయకాపురం (విజయవాడ రూరల్): విజయవాడ ప్రకాష్నగర్లోని వైఎస్సార్సీపీకి చెందిన కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీశ్కు చెందిన భవనాన్ని వీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చి వేశారు. 12 ఏళ్ల క్రితం మంజూరు చేసిన ప్లాన్ ప్రకారం సర్వే నంబర్ 89లో జగదీశ్ 3 పోర్షన్ల భవనాన్ని నిర్మించారు. ప్లానింగ్ అధికారులు శుక్రవారం భవన యజమానులకు సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసి భవనానికి నోటీసులు అంటించారు. శనివారం కూల్చివేత చేపట్టారు. జగదీశ్ భార్య సౌభాగ్యలక్ష్మి భవనం కూల్చివేస్తున్నారని తెలుసుకొని భవనం దగ్గరకు వచ్చి ఎందుకు కూల్చి వేస్తున్నారని అధికారులను అడుగుతున్నా ఎలాంటి సమాధానం చెప్పకుండా భవనం వెనుకవైపు కూల్చి వేశారు. భవనం పక్కనే ఉన్న రేకుల షెడ్డును కూడా ఆక్రమణలో ఉందని, వీఎంసీ స్థలంలో నిర్మించినట్లుగా గుర్తించామని చెబుతూ కొంత కూల్చివేశారు. దీనిపై కోర్టు స్టే ఉండ టంతో అధికారులు కూల్చివేతను నిలిపివేశారు.రాజకీయ కక్షలే కారణం.. రాజకీయ కక్షలతోనే భవనం కూల్చివేత జరిగిందని సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. హరిబాబు అనే వ్యక్తి నుంచి 214 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. 12 ఏళ్ల క్రితం విజయవాడ కార్పొరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకొని భవనం నిర్మించామని, భవనం నిర్మాణంలోని ఆక్రమణలను అధికారులు ఇప్పుడే గుర్తించడం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు భవనం కూల్చివేత చేపట్టగా..ఆ విషయం తెలుసుకుని వచ్చిన వైఎస్సార్సీపీ నగర ప్రధాన కార్యదర్శి విజయకుమార్ ఆకస్మికంగా ఎందుకు కూల్చుతున్నారని ప్లానింగ్ అధికారి కృష్ణను ప్రశ్నించారు. ఫిర్యాదు ఇప్పుడే అందింది కాబట్టి కూల్చివేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు.
![Women killed her husband](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/1_12.jpg.webp?itok=8Vvu4lYe)
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
నార్నూర్: ప్రియుడిపై మోజులో ఓ మహిళ భర్తను కిరాతకంగా హత్య చేయించింది. పథకం ప్రకారం ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపించింది. తర్వాత తనకేమీ తెలియనట్టు భర్తను ఎవరో చంపారని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జునికొలాంగూడ గ్రామ శివారులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ (40) హత్య కేసు మిస్టరీని 24 గంటల్లో ఛేదించారు. మృతుని భార్య విజయలక్ష్మి, ఆమె ప్రియుడు రాథోడ్ మహేశ్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, నార్నూర్ సీఐ రహీంపాషా శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామానికి చెందిన గజేందర్ జైనథ్ మండలం మేడిగూడ కే జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండిత్గా పని చేస్తున్నాడు. ఈయనకు గాదిగూడ మండలం ఖాండోరాంపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2017లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు (7) ఉన్నాడు.విజయలక్ష్మి నిజామాబాద్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మహేశ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గజేందర్ స్వల్పంగా దివ్యాంగుడు కావడంతో ఇష్టపడని ఆమె.. మహేశ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆమెకు నచ్చజెప్పారు. క్షమాపణ చెప్పి ఇక నుంచి ప్రియుడికి దూరంగా ఉంటానని నమ్మించింది. కానీ ఆమె మారకుండా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఆదిలాబాద్లో ఉంటూ విధులకు వెళుతున్న గజేందర్ సొంత మండలానికి బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా డు. వేసవి సెలవులు కావడంతో భార్య, కుమారుడితో స్వగ్రామం నాగల్కొండలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడే ఉంటే సంబంధం కొనసాగించడం కష్టమని భావించి మహేశ్తో కలిసి గజేందర్ను చంపాలని విజయలక్ష్మి పథకం పన్నింది. సుపారీ ఇస్తామని.. బేల గ్రామానికి చెందిన బండే సుశీల్, ఉర్వేత కృష్ణలతో కలిసి చెరో రూ.3 లక్షలు సుపారీ ఇస్తామని గజేందర్ హత్యకు విజయలక్ష్మి, మహేశ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న విజయలక్ష్మి మ హేశ్కు ఫోన్ చేసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్వగ్రామం నుంచి గజేందర్ ఉదయం 7.30 గంటలకు స్కూల్కు బయల్దేరాడు. ఈ విషయాన్ని విజయలక్ష్మి మహేశ్కు ఫోన్ చేసి చెప్పింది. పథకం ప్రకారం అర్జునికొలాంగూడ గ్రామ శివారు వద్ద ముగ్గురూ కాపు కాశారు. గజేందర్ను మొదట వె నుక నుంచి బైక్తో ఢీకొట్టడంతో అతను కింద పడి పోయాడు. అతడిని కొద్ది దూరం లాక్కెళ్లి బండల తో తల, ఇతర శరీర భాగాలపై కొట్టి హత్య చేశా రు. ఈ విషయం ప్రియుడి ద్వారా తెలుసుకున్న విజయలక్ష్మి ఉదయం గజేందర్ బీపీ మందులు వేసుకోలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని ఇంట్లో చెప్పి తన బావ కొడుకు అంకిత్ను వెంటబెట్టు కుని హుటాహుటిన ద్విచక్ర వాహనంపై హత్య జరిగిన స్థలానికి వెళ్లింది. మహేశ్, మిగతా ఇద్దరు నిందితులు అక్కడే ఉండడం చూసి వెళ్లిపోవాలని సైగ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన మామకు ఫోన్ చేసి భర్తను ఎవరో చంపేశారని సమాచారం ఇచ్చింది. మృతుడి తండ్రి జాదవ్ భిక్కు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. విజయలక్ష్మి, మహేశ్, సుశీల్, కృష్ణలను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
![Murder of parents for money](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/old%20couplce.jpg.webp?itok=4VBaGJfB)
డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య
నర్సాపూర్: డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేశాడో కిరాతకుడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపి.. అనంతరం మృతదేహాలను పెట్రోల్పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో చోటుచేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ (70) దంపతులు. గ్రామంలో ఉన్న భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పిల్లలకు సమానంగా ఇచ్చారు. తన వాటా కింద వచ్చిన రూ.4 లక్షలను చిన్న కుమారుడు లక్ష్మణ్ ఫైనాన్స్లో కారు రుణం కోసం చెల్లించాడు. అయినా రుణం తీరలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు అతను పలుమార్లు తల్లిదండ్రులను డబ్బు కావాలని ఒత్తిడి చేయగా.. కొంత డబ్బు ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవాలన్న దురాశతో హత్యకు పథకం రచించాడు.గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్.. గత నెల 17న సాదుల్లానగర్కు వెళ్లి తల్లిదండ్రులను మరుసటి రోజు తనతో పాటు కారులో తాను నివాసం ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. మర్నాడు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను మరోసారి అడిగినా వారు నిరాకరించడంతో కోపంతో లక్ష్మణ్ అదేరోజు రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొంతు నులిమి చంపాడు. తల్లి వద్ద ఉన్న 3 తులాల నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాలను కారులో తీసుకుని నర్సాపూర్ చెరువు వద్దకు తెచ్చి శవాలపై పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్లిపోయాడు. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసుల ప్రచారం: గుర్తు తెలియని జంట శవాలు దొరికిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్ల ద్వారా తమ సిబ్బంది ప్రచారం చేశారని డీఎస్పీ వెంకట్రెడ్డి చెప్పారు. రెండు శవాలు దొరికిన విషయం సాదుల్లానగర్ గ్రామస్తులకు తెలియడంతో వారు అనుమానంతో లక్ష్మణ్ను నిలదీయగా అసలు విషయం బయటకు వచి్చందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
![Young Man Brutally Murdered In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/15/55_1.jpg.webp?itok=TcLY1EhO)
వివాహేతర సంబంధం వద్దన్నందుకు..
పహాడీషరీఫ్: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హఫీజ్బాబానగర్కు చెందిన సయ్యద్ మునీర్ కుమారుడు సయ్యద్ సమీర్(19), సోహెల్, సోఫియన్ స్నేహితులు. వీరిలో ఒకరైన సోహెల్ ఇదే కాలనీలలో ఉండే ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సమీర్.. అందరం ఒకే కాలనీలో ఉంటున్నాం.. నాకు కూడా అక్కాచెల్లెళ్లు ఉన్నారు.. ఇలా చేయడం తప్పు అని సోహెల్కు సూచించాడు. ఇది జీరి్ణంచుకోలేని అతను సమీర్ తనపై దు్రష్పచారం చేస్తున్నాడని భావించాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి తన మరో స్నేహితుడు సోఫియన్తో కలిసి ముందస్తు పథకంలో భాగంగా.. సమీర్ను తీసుకుని బాలాపూర్ ఠాణా పరిధిలోని గుర్రం చెరువు ప్రాంతానికి వెళ్లారు. అనంతరం వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో సోహెల్ దాడికి పాల్పడ్డాడు. సమీర్ ఛాతి, వీపు భాగాల్లో ఐదుసార్లు బలంగా పొడిచాడు. ఈ సమయంలో విరిగిపోయిన కత్తి మృతుడి కడుపులోనే ఉండిపోవడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.