గజపతి చెరువు ఆక్రమణలపై హైకోర్టు సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

గజపతి చెరువు ఆక్రమణలపై హైకోర్టు సీరియస్‌

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

ఆయుర్వేద హాస్పటల్‌ నిర్మాణానికి బ్రేక్‌

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి ఆర్‌ఎస్‌ నంబర్‌ 433 గజపతి చెరువులో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు స్థలంలో ఇటీవల కాలంలో ఆయుర్వే వైద్యశాల నిర్మాణంకు అధికారులు పూనుకున్నారు. ఆ స్థలం చెరువుది కావడంతో పట్టణానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విస్తీర్ణంపై హైకోర్టు ఆరా తీయగా 42.33 ఎకరాలకు ప్రస్తుతం 14 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని రెవెన్యూ అఽధికారులు కోర్టుకు తెలిపారు. ఆగ్రహించిన హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం చెరువులో ఎటువంటి కట్టడాలు చేయడానికి వెళ్లేదని అది కోర్టు భవనమైనా కూల్చేయాల్సిందే అని గౌరవ న్యాయమూర్తి తెలిపారు. వెంటనే ఆక్రమణలో ఉన్న చెరువు స్థలంపై కౌంటర్‌ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఆస్థలంలో ఎన్టీటీపీఎస్‌ క్వార్టర్స్‌తో పాటు పట్టణ సచివాలయం, ఈఎస్‌ఐ వైద్యశాల, పలువురు పేదలు నిర్మించున్న గృహాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉన్నాయి.

కారు ఢీకొని మరో కారు డ్రైవర్‌ దుర్మరణం

కంచికచర్ల : రోడ్డు ప్రమాదంలో ఓ కారు డ్రైవర్‌ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ పి.విశ్వనాధ్‌ కథనం మేరకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నెల్లూరి సుజన తన కుటుంబసభ్యులతో కలిసి నిడమానూరులో వివాహ కార్యక్రమానికి గురువారం వచ్చారు. అదేరాత్రి తిరిగి ప్రయాణం అయ్యారు. కంచికచర్ల సమీపంలో మిశ్రా డాబా వద్దకు రాగానే శుక్రవారం తెల్లవారుజామున కారు రోడ్డు పక్కన ఆపి కారు డ్రైవర్‌ కొంగర ప్రశాంత్‌ కుమార్‌ మూత్ర విసర్జన కోసం వెళ్లాడు. తిరిగి కారు ఎక్కుతున్న సమయంలో వేగంగా వెనుకనుంచి వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ తలకు తీవ్రగాయమయింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ వాహన సిబ్బంది ఘటనా స్దలానికి చేరుకుని బాధితుడిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్‌కుమార్‌ మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement