విద్యార్థుల భవిష్యత్తుతో విద్యాశాఖ ఆడుకుంటోంది. బ్రిడ్జ్ కోర్సు పేరిట ముందస్తు ప్రణాళిక లేకుండా పాఠ్యపుస్తకాలను తీసుకుని పదో తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చేతిలో పాఠ్యపుస్తకాలు లేకుండా చేశారు. మ్యాపింగ్ పేరుతో విద్యార్థులను దూర ప్రాంతాలకు పంపించడం, పుస్తకాలు లేకుండా చదవమని చెప్పడం వంటి నిర్ణయాలు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనాలు.
– అంబటిపూడి సుబ్రహ్మణ్యం,
ఫ్యాప్టో జిల్లా చైర్మన్


