త్యాగానికి ప్రతీక
త్యాగానికి ప్రతీకై న గుడ్ ఫ్రైడేను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పలుచోట్ల క్రైస్తవులు ప్రదర్శనలు చేశారు. శిలువపై క్రీస్తు చేసిన త్యాగం మానవాళికి రక్షణ సందేశం ఇచ్చిందని చర్చి ఫాదర్లు తెలిపారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన సందేశాన్నిచదివి వినిపించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో కొండపై శిలువ మార్గం చేశారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


