సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

Jun 26 2025 10:16 AM | Updated on Jun 26 2025 10:16 AM

సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మునిసిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లా యీస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది. విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మునిసిపల్‌ కార్మికులు సమ్మో చేశారు. ఈ సమ్మెలో వాటర్‌, పార్క్‌, వెహి కల్‌ డిపో మెకానికల్‌, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, స్ట్రీట్‌ లైటింగ్‌, పారిశుద్ధ్యం, టౌన్‌ ప్లానింగ్‌, డ్రెయినేజీ, మలేరియా విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. 36 జీఓ ప్రకారం ఇంజినీరింగ్‌ కార్మికులకు, 12వ పీఆర్సీ ప్రకారం మునిసిపల్‌ కార్మికులకు జీతాలు పెంచాలని, తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో జూలై నాలుగో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

దళిత శోషణ ముక్తి మంచ్‌ జాతీయ కన్వీనర్‌ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి కార్మికులకు రావాల్సిన పథకాలు ఏవీ అందడంలేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో మునిసిపల్‌ కార్మికులు చేసే సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. మునిసిపల్‌ యూనియన్‌ నగర గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ.. కార్మికులంతా కలిసికట్టుగా పోరాడి హక్కులు సాధించుకోవాలన్నారు. సమ్మెకు 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ బి.సత్యబాబు మద్దతు తెలిపారు. ఈ సమ్మెలో సీఐటీయూ ఎన్టీఆర్‌ జిల్లా కార్య దర్శి ఎన్‌సీహెచ్‌ శ్రీనివాసరావు, నగర ఆధ్యక్షుడు ఎస్‌.జ్యోతిబస్‌, నాయకులు టి.ప్రవీణ్‌, డి.స్టీఫెన్‌బాబు, టి.తిరుపతమ్మ, విజయలక్ష్మి, శీలం దాసు, వి.సాంబులు, కృష్ణవేణి, ఆదిశేషు, వాటర్‌ సెక్షన్‌, డ్రెయినేజీ, మెకానిక్‌, వర్క్‌ సెక్షన్‌ బాధ్యులు, వెహికల్‌ డిపో ప్రధాన కార్యదర్శి జలసూత్ర నాగరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌

ఎంప్లాయీస్‌ యూనియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement