గవర్నర్‌కు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు ఘన స్వాగతం

Jun 26 2025 10:16 AM | Updated on Jun 26 2025 10:16 AM

గవర్నర్‌కు ఘన స్వాగతం

గవర్నర్‌కు ఘన స్వాగతం

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌కు విశ్వవిద్యాలయంలో ఘనస్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం ఆయన వర్సిటీకి చేరుకోగా.. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్‌, వాసంశెట్టి సుభాష్‌, కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ రాంజీ పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రూ.3.20 కోట్లతో నిర్మించిన వంటశాలను ప్రారంభించారు. కార్యనిర్వాహక మండలి సభ్యులతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అకడమిక్‌ బ్లాక్‌ చేరుకుని స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్‌ కార్యదర్శి హరిజవహర్‌లాల్‌, సంయుక్త కార్యదర్శి పీఎస్‌ సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల్లో నిరాశ

స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య, విశిష్ట అతిథుల చేతుల మీదుగా పట్టాలు పొందవచ్చని ఎంతో ఆశగా వచ్చిన పీహెచ్‌డీ, పీజీ పట్టాదారులు నిరాశ పడ్డారు. గవర్నర్‌ గౌరవ డాక్టరేట్‌, గోల్డ్‌ మెడల్‌ సాధించిన విద్యార్థులకు మాత్రమే ఆయన చేతుల మీదుగా అందజేశారు. మిగిలిన వారికి వర్సిటీ వీసీ, కింది స్థాయి అధికారుల చేతుల మీదుగా అందజేయడంలో వారు పెదవి విరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement