వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జ్ఞానమణి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జ్ఞానమణి

Jun 26 2025 10:16 AM | Updated on Jun 26 2025 10:16 AM

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంనకు చెందిన కైలే జ్ఞానమణి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధ వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలం పనిచేస్తున్న జ్ఞానమణి గతంలో బాపులపాడు జెడ్పీటీసీ సభ్యు రాలిగా, మహిళా విభాగం ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా సేవలు అందించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని, మహిళల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడతానని జ్ఞానమణి తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానమణికి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.

స్వయం సహాయక

బృందాలకు రుణ మంజూరు లేఖ

పటమట(విజయవాడతూర్పు): మహిళలు ఆర్థి కంగా బలోపితం అయ్యేందుకు ప్రభుత్వం, బ్యాంకులు కృషి చేస్తున్నాయని మెప్మా డైరెక్టర్‌ తేజ్‌ భరత్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి క్యాంటీన్‌ లబ్ధిదారులకు బుధవారం రుణ మంజూరులేఖను ఆయన అందించారు. ఈ సందర్భంగా తేజ్‌భరత్‌ మాట్లాడుతూ.. నగరంలో నాలుగు క్యాంటీన్‌లను మంజూరు చేశామని, వీటిలో కంటెయినర్ల సమీకరణ, కిచెన్‌ ఎక్విప్మెంట్‌ మొదలగు ఏర్పాటు చేయటానికి ఒక్కో క్యాంటీ న్‌కు రూ.14.51 లక్షలు రుణం మంజూరు చేశామని తెలిపారు. ఈ క్యాంటీన్‌లు జన సాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే పంజా సెంటర్‌లో భారత ఓవర్సీస్‌ బ్యాంక్‌, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా తృప్తి క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ పట్టణ సాధికార విభాగం ప్రాజక్ట్‌ అధికారి పి.వెంకటరమణ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

నేటి నుంచిరేషన్‌ సరుకుల పంపిణీ

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రేషన్‌షాపుల ద్వారా జూలై నెల రేషన్‌ను ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన రేషన్‌ కార్డుదారులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే సంబంధిత డీలర్‌ ద్వారా రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement