
మాజీ సైనికుల కార్పొరేషన్ నెలకొల్పాలి
నగరంపాలెం: మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు అన్నారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణను రూపొందించాలని అన్నారు. దేశ రక్షణలో విధులు నిర్వర్తించి, మిలటరీ నుంచి బయటకు వచ్చిన కొందరు సైనికులు అనారోగ్యాలతో మరణించారన్నారు. తద్వారా మాజీ సైనికుల కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐనంపూడి రత్నప్రసాద్ మాట్లాడుతూ కొందరి సైనికుల కుటుంబ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. మాజీ సైనికుడు వాకా ఆదినారాయణ, పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.
మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర
అధ్యక్షుడు మోటూరు శంకరరావు