
డైవర్షన్ పాలిటిక్స్..
వెన్నుపోటు దినం సక్సెస్ అయ్యేసరికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. వైఎస్ జగన్ కంటే మెరుగైన పాలన అందిస్తామని ప్రజలను నమ్మించి వంచించారన్నారు. మహిళలను దారుణంగా మోసం చేసి ఉసురు పోసుకున్నారని ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. అమ్మఒడి, చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా లక్షల మంది మహిళలకు వైఎస్ జగన్ అండగా నిలిచారన్నారు. శాంతిభద్రతల సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నామని, మీడియా సంస్థపై దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు.