
రోడ్డెక్కినా.. సాయం కరువు
గత ఏడాది ఆగస్టులో బుడమేరుకు వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులు తమకు పరిహారం అందలేదని రోడ్డెక్కారు. విజయవాడలో పలు ప్రాంతాలలో బాధితులు రోడ్లెక్కి నిరసన సైతం వ్యక్తం చేశారు. అదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే గ్రామ వలంటీర్లే నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు నమోదు చేసుకొని ప్రతి ఒక్కరికీ పరిహారం అందించేవారని అప్పట్లో బాధితులు బహిరంగంగానే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. గ్రామ వలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల వేలాది మంది బాధితులకు పరిహారం అందలేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వైఫల్యం స్పష్టమైంది.