యూరప్లో హైదరాబాద్ వాసి మృతి.. స్పందించిన కేటీఆర్..
హైదరాబాద్కు చెందిన మచ్చా అనిల్ కుమార్ (38) అనే వ్యక్తి యూరప్లోని క్రొయేషియాలో మృతి చెందాడు. అనిల్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుమారుడి మృతదేహన్ని హైదరాబాద్కు రప్పించేందుకు అతని కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు.
మృతుడి తండ్రి మచ్చా ఆనందం తన కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను ట్విటర్లో అభ్యర్థించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ... ‘మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నాను. క్రొయేషియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి తగు సాయం చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Very sorry for your loss sir. My team @KTRoffice will work with Indian embassy and assist https://t.co/IvxB8N11YG
— KTR (@KTRTRS) January 6, 2022
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు