
ర్యాపిడ్ టీం అందుబాటులో ఉండాలి
● జిల్లా వైద్యాధికారిణి రాజశ్రీ
బోధన్టౌన్(బోధన్): డివిజన్లోని ప్రతీ పీహెచ్సీ, యూపీహెచ్సీలో ర్యాపిడ్ టీం అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ పేర్కొన్నారు. పట్టణంలోని శక్కర్నగర్ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానలో డివిజన్ స్థాయి వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బందితో బుధవారం కీటక జనిత వ్యాధుల నివారణ, నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్ స్థాయిలో హైరిస్క్ ఏరియాలను గుర్తించి నియంత్రణ, నివారణ చర్యలతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారామెడికల్ సిబ్బంది సమయపాలన పాటించాలని, పీహెచ్సీ, యూపీహెచ్సీల్లోని సిబ్బంది టూర్ డైరీ, అడ్వాన్స్ టూర్ ప్రోగ్రాం తయారు చేసి త్వరితగతిన అందజేయాలని సూచించారు. గ్రామాల్లో డెంగీ కేసులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్వో మమత, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్ సీజ్
పట్టణంలోని క్లారిటీ సిటీ స్కాన్ సెంటర్ను డీఎంహెచ్వో రాజశ్రీ బుధవారం సీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తోపాటు రికార్డులు, డాక్టర్ కన్సల్టెంట్, ధరల బోర్డు లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా స్కాన్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లను నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.