
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు
నిజామాబాద్అర్బన్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. నగరంలోని
కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించారు. సాయి సర్వజిత్ ఆలిండియా 347 ర్యాంకు, ఎల్.శివ 1,299, ఎం.సంకీర్త్ 6,383, జి.వేదాక్షర్ 9,524 ర్యాంకులు సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం సోమవారం సన్మానించింది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రణాళికతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో కళాశాలకు చెందిన విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు.