సమన్వయంతో న్యాయవివాదాల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో న్యాయవివాదాల పరిష్కారం

Jun 1 2025 1:33 AM | Updated on Jun 1 2025 1:33 AM

సమన్వ

సమన్వయంతో న్యాయవివాదాల పరిష్కారం

జిల్లాలో పర్యటించిన హైకోర్టు జడ్జి సుజన

నిజామాబాద్‌ లీగల్‌: జిల్లాలో పనిచేసిన కాలంలో బార్‌ అండ్‌ బెంచ్‌ మధ్య సమన్వయంతో దీర్ఘ్ఘకాలిక న్యాయవివాదాలను పరిష్కరించుకున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి సుజన గుర్తుచేశారు. శనివారం నిజామాబాద్‌ నగరానికి వచ్చిన ఆమెకు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల సాయరెడ్డి, మాణిక్‌ రాజు ఆధ్వర్యంలో స్వాగతం పలికా రు. ఈ సందర్భంగా జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించిన కాలపు స్మృతులను ఆమె నెమరు వేసుకున్నా రు. అనంతరం బార్‌ అధ్యక్షుడు సాయరెడ్డి మాట్లాడుతూ జిల్లా న్యాయవ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలని జస్టిస్‌ సుజనను కోరారు. కార్యక్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పీ రాజేశ్వర్‌ రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు, బార్‌ కార్యవర్గ సభ్యులు ఆకుల రమేశ్‌, టక్కర్‌ హన్మంత్‌ రెడ్డి, నీలకంఠ రావు, గడుగు గంగాధర్‌, పిట్లం శ్రీనివాస్‌, వీ భాస్కర్‌, జే వెంకటేశ్వర్‌, మాజీ పీపీ మధుసూదన్‌ రావు, ఆశ నారాయణ, శ్రీనివాస్‌ గౌడ్‌, శ్రీమాన్‌ తదితరులు ఉన్నారు.

ఆలయాల్లో పూజలు

జస్టి్‌స్‌ సుజన శంకర్‌ దంపతులు, కుమారులతో కలిసి నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, సుభాష్‌నగర్‌ శ్రీరామాలయం, సారంగపూర్‌ హనుమాన్‌ ఆలయాల్లో పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా జడ్జిగా విధులు నిర్వహించిన సమయంలో మొక్కుకున్న మొక్కులు తీర్చుకున్నట్లు ఆమె తెలిపారు.

హైకోర్టు జడ్జిని కలిసిన సీపీ

నిజామాబాద్‌నాగారం: జిల్లాకు వచ్చిన హైకోర్టు జడ్జి కే సుజనను నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య శనివారం ఆర్‌అండ్‌బీ అథితి గృహాంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు.

సమన్వయంతో న్యాయవివాదాల పరిష్కారం1
1/1

సమన్వయంతో న్యాయవివాదాల పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement