
పేకాడుతున్న ఐదుగురి అరెస్టు
బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణంలోని రాకాసీపేట్ పరిధిలోని లయన్స్ కంటి ఆస్పత్రి వెనుక ఉన్న దర్గా సమీపంలో పేకాటస్థావరంపై శనివారం దాడి చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. ఐదుగురిని పట్టుకొని, వారి నుంచి రూ. 1,970 నగదు, ఆరు సెల్ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
38 పశువుల పట్టివేత
భిక్కనూరు: అక్రమంగా తరలిస్తున్న 38 పశువులను పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు శనివారం తెలిపారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామం నుంచి 12 లేగదూడలు, 26 ఎడ్లను బోలెరో, డీసీఎం వ్యాన్లలో మెదక్ జిల్లా నార్సింగి గ్రామంలోని మార్కెట్లో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా జాతీయ రహదారిపై పట్టుకున్నామన్నారు. పశువులను జంగంపల్లి శ్రీ క్రిష్ణ మందిరంలోని గోశాలకు తరలించామన్నారు. డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్నారు.
కామారెడ్డిలో యువకుడు అదృశ్యం
కామారెడ్డి క్రైం: నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి కామారెడ్డిలో అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్లోని గంగస్థాఽన్కు చెందిన వెంట్రామోల్ల సాహిత్ కుమార్ ప్రైవేటు కంపెనీలో సేల్స్మన్గా పని చేస్తున్నాడు. శుక్రవారం కామారెడ్డికి వచ్చిన సాహిత్ కుమార్ సాయంత్రం దేవునిపల్లి ప్రాంతంలో పోలీసులకు డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. అనంతరం స్నేహితుడు భరత్కుమార్ అతడిని బస్టాండ్కు తీసుకువచ్చి నిజామాబాద్ బస్సు ఎక్కించాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతోపాటు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు శనివారం సాయంత్రం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్వో తెలిపారు.
కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్నాగారం: నగరంలోని గాజులపేట్ ప్రాంతంలో గురుద్వార్ వద్ద ఖాజా మొయినుద్దీన్(60) జీవితంపై విరక్తితో శనివారం రాత్రి తనకు తాను కత్తితో పొడుచుకున్నాడు. స్థానికులు గమనించి 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో క్షతగాత్రుడిని జీజీహెచ్కు తరలించారు. తక్షణమే స్పందించిన 108 ఈఎంటీ రాములు, పైలెట్ అజయ్ని స్థానికులు అభినందించారు.