డిచ్‌పల్లి ఖిల్లా రామాలయానికి నిధులివ్వండి | - | Sakshi
Sakshi News home page

డిచ్‌పల్లి ఖిల్లా రామాలయానికి నిధులివ్వండి

May 30 2025 1:42 AM | Updated on May 30 2025 1:42 AM

డిచ్‌పల్లి ఖిల్లా రామాలయానికి నిధులివ్వండి

డిచ్‌పల్లి ఖిల్లా రామాలయానికి నిధులివ్వండి

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): జిల్లాలోని చారిత్రక డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆలయ కమిటీ చైర్మన్‌ జంగం శాంతయ్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. ఆలయ కమిటీ చైర్మన్‌ శాంతయ్య, మాజీ సర్పంచ్‌లు బూస సుదర్శన్‌, ఏజీ దాస్‌, డైరెక్టర్‌ నర్సారెడ్డి, వీడీసీ సభ్యులు గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలయం వరకు సీసీ రోడ్డు, హరితవనం, భక్తుల వసతి గదులు, ఆలయం పక్కనే ఉన్న చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్పు, చెరువులో బోటింగ్‌ సౌకర్యం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు చైర్మన్‌కు విన్నవించారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శరత్‌చంద్ర, శేరు లింగం, వీడీసీ సభ్యులు బూస రవి, ఆకుతోట సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

డీపీఎంల నుంచి షురూ..

బదిలీలకు ఆప్షన్లు ఇచ్చిన సెర్ప్‌

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఐకేపీలో ఉద్యోగ బది లీల ప్రక్రియ మొదలైంది. డీపీఎంల నుంచి బదిలీలను మొదలు పెట్టిన రాష్ట్ర సెర్ప్‌ శాఖ వారికి ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. జి ల్లాలో ఆరుగురు డీపీఎంలతోపాటు ఒక ఏపీడీ ఉన్నారు. వీరందరినీ బదిలీ చేసేందుకు ఆప్షన్‌ ఫారాలను ఇచ్చింది. వీటిని నింపిన డీపీఎంలు, ఏపీడీ సెర్ప్‌ శాఖకు హార్డ్‌కాపీని అందజేయగా ఆన్‌లైన్‌లో కూడా ఆప్షన్లు పెట్టుకున్నా రు. రెండు, మూడు రోజుల్లో సెర్ప్‌ సీఈవో వీ రికి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టను న్నారు. డీపీఎంల బదిలీలు పూర్తయిన వెంటనే ఏపీఎంలు, సీసీలకు కూడా బదిలీలకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. వీరికి జిల్లా స్థాయిలోనే డీఆర్‌డీవో ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ జరుగుతుంది.

జీజీ కాలేజీలో సీట్ల కేటాయింపు

నిజామాబాద్‌అర్బన్‌: గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి మొదటి విడత సీట్ల కేటాయింపు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో 1,860 సీట్లకు 1,223 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. సీట్లు వచ్చిన విద్యార్థులు వ్యక్తిగత లాగిన్‌లో సెల్ప్‌ రిపోర్టు చేయాలని, లేకపోతే అడ్మిషన్‌ కోల్పోతారన్నారు. ఈ నెల 30 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు రెండో విడత సీట్ల కోసం రిజి

స్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

సర్టిఫికెట్లు తీసుకెళ్లండి

నిజామాబాద్‌ అర్బన్‌: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కో ర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని డీఈవో అశోక్‌ ఒక ప్రకటనలో తె లిపారు. 2025 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆధార్‌ కార్డు, హాల్‌ టికెట్‌ సమర్పించి ఒరిజినల్‌ ధ్రువపత్రాలు తీసుకెళ్లాలన్నారు.

ఆర్మూర్‌లో పోలీసుల తనిఖీ

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పట్టణంలోని పాత బస్టాండ్‌లో గురువారం రాత్రి ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్‌ డాగ్‌లతో తనిఖీలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement