
వేర్వేరు ఘటనల్లో పలువురు మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు..
ఆర్మూర్టౌన్ : ఆర్మూర్ మండలంలోని మల్లారెడ్డి చెరువులో గురువారం దొండి గంగప్రసాద్(52) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన ట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. రోజు మాదిరిగానే ఉదయం 10 గంటలకు టీ స్టాల్ తీసిన గంగప్రసాద్.. 11 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి రోడ్డు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీపేట మండలం మోకన్పల్లి గ్రామానికి చెందిన దుబ్బాక నరేశ్(22) మృతి చెందినట్లు ప్రొబెషనరీ ఎస్సై శైలేందర్ తెలిపారు. నరేశ్ జిల్లా కేంద్రంలోని హరిహర ప్లాస్టిక్ దుకాణంలో పనిచేస్తాడు. బుధవారం రోజూ వారీ పనిని ముగించుకొని బైక్పై మోకన్పల్లికి వెళుతుండగా పాండురంగ రైస్మిల్ వద్ద ఉన్న రైల్వేగేట్ ప్రాంతంలో కాలినడకన వెళుతున్న ఖానాపూర్ గ్రామానికి చెందిన రేకులపల్లి నాగభూషణంను ఢీ కొట్టాడు. ప్రమాదంలో నరేశ్ బైక్ పైనుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. నాగభూషణంకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబెషనరీ ఎస్సై తెలిపారు.
డిచ్పల్లిలో గుర్తు తెలియని వ్యక్తి..
డిచ్పల్లి : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి (సుమారు 60 సంవత్సరాలు) గురువారం ఉదయం మృతి చెందినట్లు డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. డిచ్పల్లి రైల్వేస్టేషన్ కాంపౌండ్ వాల్ లోపల బుధవారం ఉదయం అపస్మారకస్థితిలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు గురువారం ఆ వ్యక్తి మృతి చెందాడు. చామనఛాయ రంగులో ఉన్న మృతుడి ఒంటిపై గోధుమ రంగు ఫుల్ షర్ట్, లేత గోధుమ రంగు ప్యాంటు ఉన్నాయని తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే డిచ్పల్లి సీఐ 87126 59851, ఎస్సై 87126 59852 నంబర్లకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.