రిజిస్ట్రార్‌ పదవి కోసం.. | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రార్‌ పదవి కోసం..

May 29 2025 9:49 AM | Updated on May 29 2025 9:49 AM

రిజిస్ట్రార్‌ పదవి కోసం..

రిజిస్ట్రార్‌ పదవి కోసం..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజకీయ క్రీడలు ఆగడం లేదు. ఇప్పటికే గత నాలుగేళ్లుగా చిత్రవిచిత్ర రాజకీయాలు, అవినీ తి, అక్రమాల నియామకాలతో అభాసుపాలైన వర్సిటీలో కొత్త వీసీ వచ్చాక కొన్ని నెలల పాటు రా జకీయాలకు విరామం దక్కింది. అయితే పాలకమండలి ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తా త్సారం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో పాలకమండలి ఏర్పాటు, తరువాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పలువురు ఆశిస్తూ వస్తున్నారు. అయి తే తాజాగా మళ్లీ కుర్చీలాటకు కేంద్రమైన రిజిస్ట్రార్‌ కుర్చీ కోసం ఒక వివాదాస్పద ప్రొఫెసర్‌ రాజకీయ క్రీడ మొదలుపెట్టినట్లు విద్యార్థి సంఘాలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకుల చుట్టూ, ఉన్నతాధికారుల చుట్టూ చక్క ర్లు కొడుతూ పైరవీల ద్వారా మళ్లీ రిజిస్ట్రార్‌ కుర్చీ లో కూర్చునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత అక్టోబర్‌ 18న వీసీగా ప్రొఫెసర్‌ యాదగిరిరావు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే సదరు వివాదాస్పద ప్రొఫెసర్‌ చాపకింద నీరులాగా పైరవీలకు శ్రీకారం చుట్టినప్పటికీ 15 రోజుల క్రితం కామారెడ్డి జిల్లాకు చెందిన కీలకమైన కాంగ్రెస్‌ నేతను సంప్రదించి, ఆ నేత ద్వారా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యెగితారాణాకు లేఖ రాయించుకున్నట్లు సమాచారం.

● వీసీ యాదగిరిరావు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనకుతానుగా పరిచయం చేసుకుని, తన ప్రతిభను గుర్తించి రిజిస్ట్రార్‌ పదవి కట్టబెట్టాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చిన వీసీ బోధన, బోధనేతర సిబ్బంది గురించి స్పష్టమైన అవగాహన తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు ప్రొఫెసర్‌ ప్రతిపాదనను పక్కన పెట్టారు.

● వర్సిటీలో నిత్యం కులరాజకీయాలకు కేంద్రబిందువుగా ఉన్న సదరు ప్రొఫెసర్‌ తన సామాజిక వ ర్గానికి చెందిన ప్రముఖ కులనేతను సైతం సంప్రదించి వీసీకి చెప్పించే ప్రయత్నం చేయడం గురించి విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అయితే అప్పటి కే అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఆచార్యుడికి కీలక పదవి కోసం పైరవీ చేయడం, మరోవైపు వివాదాస్పద ఆచార్యుడి గురించి అన్ని విషయాలు తెలియడంతో వీసీ రిజిస్ట్రార్‌ పదవి అంశాన్ని సున్నితంగా పక్కకు పెట్టినట్లు తెలిసింది. తిరస్కరణకు గురవుతున్నప్పటికీ ప్రయత్నాలు ఆపడం లేదు.

● కాగా ఈ ప్రొఫెసర్‌ కోసం అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నేత రాసిన లేఖను చూసిన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సదరు నేతకు ఫోన్‌ చేసి మరీ ఈ ప్రొఫెసర్‌ గురించి గతంలో జరిగిన ఘటనలను గురించి వివరించినట్లు విశ్వసనీయ సమాచారం.పైగా సదరు ప్రొఫె సర్‌ పైరవీలు, లేఖ రాయించిన విషయమై ఆమె మండిపడినట్లు తెలిసింది.

కామారెడ్డికి చెందిన కాంగ్రెస్‌ నేత ద్వారా ప్రయత్నాలు చేసిన ప్రొఫెసర్‌

ప్రొఫెసర్‌ ప్రయత్నాలపై మండిపడ్డ విద్యాశాఖ కార్యదర్శి

తెలంగాణ యూనివర్సిటీలో ఆగని

రాజకీయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement