
ఒలింపిక్ సంఘ భవన స్థలాన్ని కాపాడుకుంటాం
నిజామాబాద్నాగారం: ఒలింపిక్ సంఘ భవన స్థ లం కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడుకుంటా మని సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అ న్నారు. ఆదివారం నగరంలోని ముబారక్నగర్లో ఉన్న ఒలంపిక్ సంఘ భవన స్థలాన్ని సభ్యులతో కలిసి పరిశీలించారు. 2010లో గత ప్రభుత్వం ఖలీల్వాడిలో ఉన్న స్టేడియం స్థలానికి బదులు ముబారక్నగర్లో 7ఎకరాల35 గుంటల స్థలంతో పాటు పక్కనే ఉన్న 700 గజాల స్థలాన్ని సంఘ భవనం కోసం కేటాయించిందని అన్నారు. ఈ స్థలంలో గ తంలో మంత్రి ఉన్న సుదర్శన్రెడ్డి మంజూరు చేసిన రూ. 15 లక్షల నిధులతో బేస్మెంట్, పిల్లర్ల వరకు పనులు చేపట్టినట్లు తెలిపారు. కొందరు భూకబ్జాదారులు స్థలాన్ని తమదంటు ఆక్రమణలకు పాల్ప డుతున్నారని అన్నారు. ఎవరైనా స్థలాన్ని కబ్జా చే యాలని చూస్తే సహించేది లేదన్నారు. సభ్యులు భూమారెడ్డి, సంజీవరెడ్డి, వెంకటేశ్వర్లు, అబ్బన్న, ఎ గ్జిక్యూటివ్ సభ్యులు జావేద్, రమేశ్ పాల్గొన్నారు.