ముగిసిన పశుగణన | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పశుగణన

Apr 29 2025 9:55 AM | Updated on Apr 29 2025 9:55 AM

ముగిసిన పశుగణన

ముగిసిన పశుగణన

కేంద్రమే చెప్పాలి

జిల్లాలో ఆరు నెలల పాటు

కొనసాగిన సర్వే

కేంద్ర ప్రభుత్వానికి చేరిన నివేదికలు

త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం

జిల్లాలో పశు గణన సర్వే పూర్తయి దాదా పు వారం రోజులవుతోంది. జిల్లాలో ఏ పశువులు ఎన్ని ఉన్నాయో పశుసంవర్ధక శాఖ వద్ద లెక్కలు ఉన్నాయి. కానీ, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ మే లెక్కలను ఆమోదించి బయటకు చెప్పాలి. దేశ వ్యాప్తంగా చేపట్టిన సర్వే కావడంతో ఒకేసారి పశు గణాంకాలు వెల్లడిస్తారు. 2018–19 గణంకాల ప్రకా రం జిల్లాలో ఆవులు, ఎడ్లు కలిపి 1,0,1252, గేదెలు 2,06,898, గొర్రెలు 7,06,898, మేకలు 1,05,089 ఉన్నాయి. అయితే ఈ సంఖ్యలో భారీ హెచ్చుతగ్గులు ఉండొచ్చు.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 21వ అఖిల భారత పశు గణన జిల్లాలో ముగిసింది. పశువైద్య సిబ్బంది ఆరు నెలల పాటు శ్రమించి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. ‘పశుధన్‌’ యా ప్‌ ద్వారా మొత్తం పదహారు జంతు జా తుల వివరాలను సేకరించగా, నివేదికలు ఆన్‌లైన్‌లో కేంద్రానికి చేరాయి. ఏ జాతి పశువులు ఎన్ని ఉన్నాయ నే గణంకాలు చె ప్పేందుకు సంబంధిత అధికారులు నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే లెక్కలను త్వర లో విడుదల చేస్తుందని చెబుతున్నారు. నవంబర్‌లో మొదలైన పశు గణన కోసం పశుసంవర్ధక శాఖ 109మంది ఎన్యుమరేటర్లను, సర్వేను పర్యవేక్షించేందుకు 28మంది పర్యవేక్షకులను నియమించారు. సర్వే ప్రారంభమై మొదట్లో సిబ్బందికి ఇ బ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక కారణాలతో యాప్‌ పని చేయలేదు. దీంతో ఫిబ్రవరిలోనే పూర్తి కావాల్సిన సర్వే ఏప్రిల్‌ వరకు సాగింది. మొత్తం 31 మండలాల్లోని 545 గ్రామ పంచాయతీలతోపాటు పట్టణాల్లో కూడా పశు గణన చేపట్టారు. సుమారు 4లక్షల నివాస గృహాలకు వెళ్లి ఆయా ఇళ్లల్లో పశు సంపద వివరాలను యాప్‌లో నమోదు చేశారు. ఐ దేళ్ల క్రితం, ప్రస్తుతం చేపట్టిన సర్వే వివరాలను అనధికారికంగా చూస్తే చాలా వరకు పశు సంపద తగ్గినట్లు కనిపించిందని సర్వే చేసిన కొందరు సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రధానంగా గేదెలు, ఆవులు, ఎడ్లు, మేకలు, గొర్రెలు తగ్గే అవకాశం ఉందని, గేదెలు, ఆవులు తక్కువగా కనిపించాయంటున్నారు. నానాటికి పశు సంపద తగ్గిపోతున్న విషయాన్ని రైతులు సైతం అంగీకరించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ కొన్ని చోట్ల గేదెల పెంపకం పెరిగిందని, వ్యవసాయ క్షేత్రాలు, ఇళ్ల వద్ద డైయిరీలను ఏర్పాటు చేసుకోవడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.

ఒకేసారి వివరాలు వెల్లడవుతాయి

జిల్లాలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకేసారి పశుగణన వి వరాలను వెల్లడిస్తుంది. విడుదల చేసిన వెంటనే జి ల్లాలో ఏ పశువులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు చె ప్పేందుకు వీలుంటుంది. అప్పటి వరకు సర్వే వివరాలను బయటకు చెప్పలేము. బహుశా ఒకటి రెండు నెలల్లో లెక్కలు విడుదలయ్యే అవకాశం ఉంది.

– రోహిత్‌ రెడ్డి, పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి జేడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement