
సిద్ధులగుట్టపై చిరుత
● చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో
సంచారం
● వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన భక్తులు
ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సి ద్ధులగుట్టపై సోమవారం చిరుత సంచరించింది. నవనాథ సిద్ధేశ్వరాలయంలో ప్రతి సోమ వారం ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. గుట్టపై ఉన్న చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో రాళ్ల మధ్య చిరుతను చూసిన కొందరు భక్తులు వీడియోతీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమా చారం అందించారు. ఏడేళ్ల క్రితం ఇదే గుట్టపై చిరుత పులి కనిపించడంతో అటవీ శాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు బోను ఏర్పా టు చేసినప్పటికీ చిక్కలేదు. తాజాగా మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు, పట్టణ ప్రజ లు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించాలని కోరుతున్నారు.