
‘యువ వికాసం’పై క్షేత్రస్థాయి పరిశీలన
మోర్తాడ్(బాల్కొండ): రాజీవ్ యువ వికాసం దర ఖాస్తులపై అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించాయి. నిరుద్యోగ యువతీయువకులకు రాయితీ రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 58 వేలకు పైగా దరఖాస్తులు అందగా 22 వేలకుపైగా యూనిట్లకు రుణాల ను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో ఆన్లైన్, ఆఫ్లైన్లో అందిన దరఖాస్తుల వివరాలను మరోసారి తెలుసుకునేందుకు అ ధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. గ్రా మాలలో మండల పరిషత్ అధికారులు, మున్సిపా లిటీలలో వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది దర ఖాస్తుదారుల వివరాలు సేకరిస్తున్నారు. సరైన ధ్రు వపత్రాలు జత చేయని దరఖాస్తుదారులకు ఫోన్ చేసి సర్టిఫికెట్లను తెప్పించుకుంటున్నారు.
ఒక రేషన్ కార్డుపై ఒక్కరికే అవకాశం
రాజీవ్ యువవికాసం రాయితీ రుణాలను ఒక రేషన్ కార్డుపై ఒకరికే అందించే అవకాశ ఉంది. ఒక కార్డుపై ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్క దరఖాస్తునే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎక్కువ దరఖాస్తులు ఉంటే కార్డు హోల్డర్ను సంప్రదించి ఒక దరఖాస్తును పరిశీలించడానికి ఆమోదం తీసుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయితీ రుణాలు పంపిణీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతలోపు అధికారులు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి నివేదికలను ప్రభుత్వానికి పంపనున్నారు. కాగా, లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా చేపట్టే అవకాశం ఉందో ఇప్పటికీ స్పష్టత లేదు. ఒక్కో మండలంలో ఎన్ని యూనిట్లకు రుణాలను అందించే అవ కాశం ఉందో వెల్లడించకపోవడం గమనార్హం.
జిల్లాలో 58వేలకుపైగా దరఖాస్తులు
క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం
దరఖాస్తుదారుల ఇళ్లకు
అధికార బృందాలు
పరిశీలన జరుగుతోంది
క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన సాగు తోంది. దరఖాస్తుదారులు ఎవరైనా సర్టిఫికెట్లను జత చేయకపోతే తెప్పించుకుంటున్నాం. అర్హుల ఎంపికపై అధికారుల ఆదేశాలను పా టిస్తాం.
– శ్రీధర్, ఎంపీవో, మోర్తాడ్