ఆర్జీయూకేటీలో అకడమిక్‌ రివ్యూ మీటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీలో అకడమిక్‌ రివ్యూ మీటింగ్‌

Jul 1 2025 3:58 AM | Updated on Jul 1 2025 3:58 AM

ఆర్జీయూకేటీలో అకడమిక్‌ రివ్యూ మీటింగ్‌

ఆర్జీయూకేటీలో అకడమిక్‌ రివ్యూ మీటింగ్‌

బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2025–26 విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం అకడమిక్‌ రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్‌ ఏ.గోవర్ధన్‌, ఓఎస్‌డి ప్రొఫెసర్‌ ఈ. మురళీదర్శన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్‌ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, రిజిస్టర్ల నిర్వహణ, డేటా భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్‌ఏఏసీ ఫైల్‌ తయారీపై అన్ని శాఖల అధ్యాపకులు శ్రద్ధ వహించాలని సూచించారు. త్వరలో (ఎంటెక్‌)పీహెచ్‌డీ ప్రవేశ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. బాసర, మహబూబ్‌ నగర్‌ సెంటర్లకు సంబంధించిన ప్రవేశ ఫలితాలు విడుదల జూలై 4న, జూలై 7, 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ ఫలితాలను మొదటిగా విడుదల చేసిన విశ్వవిద్యాలయంగా బాసర ఆర్జీయూకేటీ నిలిచిందన్నారు. ఇందులో భాగమైన టీచింగ్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీన్లు డాక్టర్‌ మహేష్‌, డాక్టర్‌ విట్టల్‌, డాక్టర్‌ నాగరాజు, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, పీఆర్‌వో విజయ్‌ కుమార్‌, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement