
పాత పెన్షన్ పునరుద్ధరించాలి
నిర్మల్చైన్గేట్: పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కలెక్టరేట్ ఎదుట ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. కొత్త పెన్షన్ విధానంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎసరుపెట్టే ప్రయత్నం చేస్తుందని పెన్షనర్ల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంసీ.లింగన్న ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫైనాన్స్ బిల్లులో చేర్చి ఆకస్మాత్తుగా ఈ ఏడాది మార్చి 25న లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారన్నారు. కొత్త పద్ధతి పెన్షన్ విధానాన్ని అడ్డుకోవాలని ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఉద్యమ నిర్మాణానికి నడుం బిగించిందన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఒకే రోజు అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రికి లేఖలు పంపేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వేల సంఖ్యలో పెన్షనర్ల సంతకాలు సేకరించి వాటిని ప్రధానమంత్రికి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్కు అందించారు. కార్యక్రమంలో పెన్షనర్లు విలాస్, లోలం గంగన్న, జనార్దన్, సత్మారాం, రాములు వివిధ మండలాల నుంచి వచ్చిన పెన్షనర్లు పాల్గొన్నారు.