సుప్రీంకోర్టు జడ్జికి గుండెపోటు.. బాగానే ఉన్నానంటూ మెసేజ్‌ | SC Judge MR Shah Flown To Delhi After Heart Attack | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు జడ్జికి గుండెపోటు.. బాగానే ఉన్నానంటూ మెసేజ్‌

Jun 16 2022 5:01 PM | Updated on Jun 16 2022 5:19 PM

SC Judge MR Shah Flown To Delhi After Heart Attack - Sakshi

జస్టిస్‌ షా సందేశంలోని వీడియో స్క్రీన్‌ షాట్‌

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్‌ షా ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు.

ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్‌ షా గుండెపోటుకు గురయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో ఉండగా.. గురువారం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఎయిర్‌ ఆంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించారు. 

షా అస్వస్థత వార్త తెలియగానే.. సుప్రీంకోర్టు అధికార వర్గాలు హోం​ మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఎయిర్‌ఆంబులెన్స్‌లో హుటాహుటిన తరలించాయి. అయితే తాను బాగానే ఉన్నానని, రేపో ఎల్లుండో పూర్తిగా కోలుకుంటానని ఆయన చెప్తుండగా..  ఓ షార్ట్‌ వీడియో బయటకు వచ్చింది.

జస్టిస్‌ షా గతంలో గుజరాత్‌ హైకోర్టు జడ్జిగానూ పని చేశారు. ఆపై పాట్నా హైకోర్టు సీజేగా విధులు నిర్వహించారు. 2018లో ఆయన్ని సుప్రీంకోర్టుకు ప్రమోట్‌ చేశారు. మే 15, 2023న ఆయన రిటైర్‌ కావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement