Viral Video: కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకూతురు.. ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీస్‌..

Rpf Staff Rescue Two Passengers Slipped Running Train Mubai - Sakshi

ముంబై: ప్లాట్‌ఫాంపై కదులుతున్న రైలు ఎక్కబోయి తల్లీకూతురు కిందపడ్డారు. అక్కడే ఉన్న రైల్వే పోలీసు, ఓ ప్యాసెంజర్ వీళ్లిద్దరిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ముంబైలోని వాసాయ్ రోడ్‌ రైల్వే స్టేషన్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

తల్లీకూతురును రక్షించిన కానిస్టేబుల్ తేజారామ్‌ను ఆర్‌పీఎఫ్‌ ప్రశంసించింది. ఈ ఘటనలో ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. తమ ప్రాణాలు కాపాడినందుకు రైల్వే కానిస్టేబుల్ తేజారామ్‌కు తల్లీకూతురు కృతజ్ఞతలు చెప్పారు.
చదవండి: పెళ్లి రద్దు.. రూ.50 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేసిన అమ్మాయి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top