Court Denied Bail To Delhi Liquor Scam Accused - Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాం నిందితులకు బెయిల్‌ నిరాకరణ

Feb 16 2023 3:20 PM | Updated on Feb 16 2023 5:57 PM

Delhi liquor scam accused denied bail - Sakshi

శరత్‌ చంద్రారెడ్డి(ఎడమ), విజయ్‌ నాయర్‌(కుడి)

అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డితో పాటు మరో ముగ్గురికి.. 

సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన నిందితులకు ఊరట దక్కలేదు. మనీలాండరింగ్‌ ఆరోపణలతో అరెస్ట్‌ అయిన ఐదుగురికి గురువారం బెయిల్‌ నిరాకరించింది కోర్టు. 

లిక్కర్‌ స్కాంలో విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, సమీర్‌ మహేంద్రు, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబులను దర్యాప్తు సంస్థ అరెస్ట్‌ చేసింది. అయితే బెయిల్‌ కోసం వీళ్లు ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ Rouse Avenue Court కోర్టును ఆశ్రయించగా.. కోర్టు బెయిల్‌కు తిరస్కరించింది.

123 పేజీలతో కూడిన తీర్పును వెలువరించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్‌. ఐదుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. నిందితులు మనీలాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 3 కింద.. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కాబట్టి, ఈ ఐదుగురు నిందితులు బెయిల్‌కు అర్హులు కాదు. అందుకే బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తున్నాం అని స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement