Covid-19: India Continues To Report Over 3000 Cases, 6 New Deaths Logged - Sakshi
Sakshi News home page

Coronavirus: వరుసగా రెండో రోజు భారీగా కేసులు.. ఆరుగురు మృతి

Mar 31 2023 9:38 AM | Updated on Mar 31 2023 12:33 PM

Covid19: India Continues To Report Over 3000 Cases 6 New Deaths - Sakshi

 అనూహ్యంగా 50 శాతం పెరిగిన కరోనా కేసులు. కొత్తగా ఆరు మరణాలు.. 

గత కొన్ని వారాల నుంచి కరోనా ఉధృతి మళ్లీ కనిపిస్తోంది. దేశంలో నిన్న ఒక్క రోజులోనే మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో క్రియశీలక కేసుల సంఖ్య 15,208కి చేరినట్లయ్యింది. 

ఇప్పటి వరకు సుమారు 1396 మంది రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్‌ అయ్యారు. గత 24 గంట్లో తాజా కేసులతో రికవరి రేటు 98.78% తగ్గింది. మరణాల రేటు 1.19%గా ఉంది. కొద్ది రోజులుగా కేసులు అనుహ్యంగా పెరడం ప్రారంభించాయి. గత మార్చి 30నే దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో 50% పెరుగుదల కనిపించింది. కాగా, మహారాష్ట్రలో కొత్తగా 694 కొత్త కేసులు, కేరళలో 765 కేసులు నమోదయ్యాయి

(చదవండి: దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు.. మళ్లీ కరోనా టెన్షన్‌)

Advertisement
 
Advertisement
Advertisement