వైరల్‌: ట్రాక్టర్‌తో నిమిషాల్లో పాలు పితికిన రైతు

Anand Mahindra Shares Farmer Milking Cows Using His Tractor In Maharashtra - Sakshi

ముంబై: ఓ రైతు ఇంజనీర్‌లా వినూత్న ఆలోచన చేశాడు. చేతులకు పని చెప్పకుండానే ట్రాక్టర్‌తో చిటికెలో ఆవు పాలు పితికిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను మహీంద్రా గ్రూప్‌ అధినేత‌ ఆనంద్ మహీంద్ర బుధవారం ట్విటర్‌లో‌ పంచుకున్నారు. ‘గ్రామాల్లో మా ట్రాక్టర్‌లను మల్టీ టాస్క్‌లుగా ఉపయోగిస్తున్న వీడియోలను ప్రజలు నాకు తరచు పంపిస్తున్నారు. అందులో ఇది నాకు కొత్తగా అనిపించింది. ఇంజనీర్‌ కానీవారు ఇలా చేయగలరా’ అంటూ ఈ వీడియోను షేర్‌ చేశారు. (చదవండి: నవ్వొద్దని ప్రభుత్వం ఆంక్షలు, కానీ..)

అయితే 1.12 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో మహరాష్ట్రకు చెందిన ఈ రైతు ట్రాక్టర్‌ సాయంతో పాలను పితికే విధానాన్ని వివరించాడు. నాబ్‌లను ఉపయోగించి ట్రాక్టర్‌ ఇంజన్‌ సాయంతో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా 2, 3 నిమిషాలలో పాలను పితకొచ్చు అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరిని తెగ ఆకట్టుకుంటోంది. అతడి వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘అందుబాటులో ఉన్న సాంకేతికతను అతడు ఉపయోగించిన తీరు అద్భుతం’ అంటూ నెటజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top