
తీపికబురు..
స్టాఫ్నర్స్, ఎంఎల్హెచ్పీ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్
● ఆన్లైన్లో మెరిట్ లిస్ట్.. వారంలో ఫైనల్ లిస్ట్
● 24న సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
● 16 నెలల ఎదురుచూపులకు తెర
● అదృష్టవంతులు ఎవరో..?
నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని 16 నెలలుగా ఎదురుచూస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సు, ఎంఎల్హెచ్పీ పోస్టులకు సంబంధించి వారం రోజుల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలోనే తీపికబురు అందనుంది.
దరఖాస్తుల పరిశీలన
జిల్లాలో చేపడుతున్న నియామకాలపై గతంలో వచ్చిన అనుమానాలకు తావులేకుండా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్ధేశంతో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో డీఎంహెచ్ఓ కలిసి స్టాఫ్నర్సు, ఎంఎల్హెచ్పీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను జల్లెడ పట్టారు. గతంలో ఆన్లైన్లో పెట్టిన మెరిట్ లిస్ట్ ఆధారంగా వాటిని క్షణ్ణంగా పరిశీలించి మరోసారి ఈ నెల 16న ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ను ఉంచారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో 8 మంది తమకు మెరిట్ లిస్టులో ఎందుకు రాలేదని అడగగా వాటిని సైతం పరిశీలించి అధికారులు సమాధానం ఇచ్చారు. అనంతరం 21 స్టాఫ్ నర్సు, 5 ఎంఎల్హెచ్పీ పోస్టులకు గాను 1:3 ప్రకారం అభ్యర్థులను తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆన్లైన్లో మెరిట్ లిస్టులో ఉన్న వారు రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచించారు. ఈ నెల 24న జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ సిక్తా పట్నాయక్తో పాటు డీఎంహెచ్ జయచంద్రమోహన్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సమక్షంలో 78 మంది అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

తీపికబురు..