ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం

Jun 26 2025 6:21 AM | Updated on Jun 26 2025 6:21 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం

కోస్గిరూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను సైతం మంజూరు చేస్తుందని.. నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని డీఆర్‌డీఓ మోగులప్ప అన్నారు. బుధవారం మండలంలోని చంద్రవంచలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. చంద్రవంచ గ్రామానికి 220 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 102 మంది లబ్ధిదారులు బెస్మెంట్‌ వరకు నిర్మాణాలు చేపట్టారని, ఇందులో 52 మందికి మొదటి విడత రూ.లక్ష వారి ఖాతాల్లో పడ్డాయని, మిగతా వారికి సోమవారం పడనున్నామని తెలిపారు. అనంతరం మండలంలోని నాచారం గ్రామంలోని కేజీబీవీ పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, మీర్జాపూర్‌ గ్రామంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి మఽధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులతో సహపంక్తి భోజనాన్ని చేశారు. చెన్నారంలో హర్టీకల్చర్‌ లో మొక్కల నాటడాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో యంపిడిఓ శ్రీదర్‌ , పంచాయతి కార్యదర్శి సునిత ,తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement