యువత యాంటీ డ్రగ్స్‌ సోల్జర్స్‌గా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

యువత యాంటీ డ్రగ్స్‌ సోల్జర్స్‌గా పనిచేయాలి

Jun 26 2025 6:21 AM | Updated on Jun 26 2025 6:21 AM

యువత యాంటీ డ్రగ్స్‌ సోల్జర్స్‌గా పనిచేయాలి

యువత యాంటీ డ్రగ్స్‌ సోల్జర్స్‌గా పనిచేయాలి

నారాయణపేట: యువత గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు యాంటీ డ్రగ్స్‌ సోల్జర్స్‌గా పనిచేయాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బుధవారం డీడబ్ల్యూఓ ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్పీ, అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారు సూచించారు. ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌లో కలెక్టరేట్‌, పోలీస్‌, ప్రెస్‌, డీడబ్ల్యూఓ మొత్తం నాలుగు జట్లు పాల్గొన్నాయి. మొదట పోలీస్‌ జట్టు, కలెక్టరేట్‌ జట్లు తలపడగా.. పోలీస్‌ జట్టు విజయం సాధించింది. అనంతరం డీడబ్ల్యూఓ, ప్రెస్‌ జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరగగా.. ప్రెస్‌ జట్టు విజయం సాధించింది. చివరగా పోలీస్‌ జట్టు, ప్రెస్‌ జట్టు తుది పోరులో తలపడగా పోలీస్‌ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. గెలుపొందిన విన్నర్‌, రన్నర్‌ జట్లకు ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌, అదనపు ఎస్పీ రియాజ్‌ హుల్‌ హాక్‌, డీపీఆర్‌ఓ రషీద్‌ కప్‌ లను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్‌ఐ నరసింహ, డీవై ఎస్‌ ఓ వెంకటేష్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement