ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

Apr 30 2025 12:09 AM | Updated on Apr 30 2025 12:09 AM

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

నారాయణపేట: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్‌, సంధ్యారాణి అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరజాన్‌ సూచన మేరకు పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెల 20వ తేదీలోగా కమిటీల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కులాల వారీగా అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇదివరకు నామినెటేడ్‌ పద్ధతిలో పార్టీ అధ్యక్షుల నియామకం జరిగిందని.. ఇప్పుడు పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు కష్టపడిన వారిని గుర్తిస్తూ.. నేరుగా పదవులకు పోటీచేసే విధంగా పార్టీ అవకాశం కల్పించిందన్నారు. పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించి.. పార్టీ బాధ్యతలు నిర్వర్తించే సత్తా ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ పదవులు దక్కని వారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత మండల, పట్టణ అధ్యక్షులు పదేళ్లుగా కష్టపడి పనిచేశారని, వారి కృషి ఫలితంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అలాంటి వారిని పక్కన పెట్టవద్దని కోరారు. కష్టపడిన వారికి మళ్లీ అవకాశం కల్పించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ పాదయాత్రను ప్రతి గ్రామంలో చేపట్టి.. రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడులను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, పార్టీ నాయకులు బాలకృష్ణారెడ్డి, కొత్తకోట సిద్దార్థరెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, ఎండీ సలీం, నరహరి, వీరన్న, సూర్యమోహన్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, నర్సింహ, రవికుమార్‌, యఘ్నేశ్వర్‌రెడ్డి, చంద్రకాంత్‌గౌడ్‌, బండి వేణుగోపాల్‌, సరాఫ్‌ నాగరాజు, గందె చంద్రకాంత్‌ తదితరులు ఉన్నారు.

పార్టీని సంస్థాగతంగా బలోపేతంచేసేందుకు కొత్త కమిటీలు

టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్‌, సంధ్యారాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement