
భూ భారతిపై విస్తృత చర్చ అవసరం
మాగనూర్/కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై విస్తృత చర్చ జరగాలని, తద్వారా చట్టంపై అవగహన కలిగి సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం మాగనూర్, కృష్ణాలో నిర్వహించిన మాగనూర్ భూభారతి అవగహన సదస్సుకు వారు హాజరయ్యారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సదస్సును ప్రారంభించారు. చట్టం విధి విధానాలపై అధికారులు రైతులకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి చట్టంలో లేని అనేక నిబంధనలను 1971 రెవెన్యూ చట్టంలోని మంచి ఆంశాలను తీసుకుని రైతులకు లబ్ధి చేకూర్చేలా భూభారతి చట్టాన్ని రూపొందించారన్నారు. భూభారతి ద్వారా రైతులకు వారి భూములపై అన్ని రకాల హక్కులు కల్పించబడాయన్నారు. గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలు ఏవి ఉన్నా జూన్ 2 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి అక్కడ వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారని, వాటిని 30 రోజుల్లో వాటిని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.
కొత్త చట్టంతో రైతుల పాలిట వరం : ఎమ్మెల్యే
భూ భారతి చట్టం రైతుల పాలిట వరం అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో అనేక అవస్థలు పడ్డ రైతులకు భూభారతితో మేలు చేకూరనుందని వెల్లడించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే సీఎం రేవంత్రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారని, భూ సమస్యలు పరిష్కరించడమే కాకుండా వారికి భూధార్ కార్డును కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. కొత్త చట్టం ప్రకారం కింది స్థాయి అధికారుల వద్ద తప్పు జరగితే పైస్థాయి అధికారులు న్యాయం చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కూమార్, ఆర్డీఓ రాంచందర్, తహసీల్దార్లు సురేష్కుమార్, వెంకటేష్, ఎంపీడీఓలు జానయ్య, రహ్మతుద్దీన్ పాల్గొన్నారు.
తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి
ఆదివారం మాగనూర్ మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన ఆకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి షరుతులు లేకుండా కోనుగులు చేయాలని మండల రైతులు జిల్లా కలెక్టర్కు విన్నవించారు. ముఖ్యంగా మండలంలో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని, రైతులకు లారీలు రావాలంటే రూ.5 వేల వరకు లంచం ఇవ్వాల్సిందేనని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు 7 లక్షల టన్నులు జరిగాయని, మిగిలిన 8 లక్షల గన్నీ బ్యాగులు ఏమయ్యాయని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంపై సత్వరమే ఎంకై ్వరి చేస్తామని కలెక్టర్ రైతులకు తెలిపారు. మాహబూబ్నగర్, గద్వాల జిల్లాల నుండి మరో 4 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు తీసువస్తామని, లారీల కొరత లేకుండా చూస్తామన్నారు. తడిసిన ధాన్యంను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతామని తెలిపారు.