మలేరియా నిర్మూలనకు కృషి | - | Sakshi
Sakshi News home page

మలేరియా నిర్మూలనకు కృషి

Apr 26 2025 12:20 AM | Updated on Apr 26 2025 12:20 AM

మలేరియా నిర్మూలనకు కృషి

మలేరియా నిర్మూలనకు కృషి

నారాయణపేట: మలేరియా నిర్మూలన కోసం ప్రజలు, వైద్య సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ జయచంద్ర మోహన్‌ అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణం నుంచి అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన రహదారి గుండా వీర సావర్కార్‌ చౌరస్తాకు నినాదాలు చేస్తూ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా ఆడ ఎనాఫిలిస్‌ దోమ ద్వార వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ వ్యాధి నివారించాలంటే ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రైడే ను పాటించాలని, దోమలు పుట్టకుండా.. కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చన్నారు. అదే విధంగా మలేరియా వ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ ఎన్‌.శైలజా, వైద్యులు నర్సింహారావు, మల్లికార్జున్‌ డిఎంఅండ్‌హెచ్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది బిక్షపతి, గోవిందరాజు శ్రీనివాస్‌, తబితారాణి, శంకర్‌, శ్రీధర్‌, గోవిందా రావు, బుగ్గెశ్వర్‌, బాలశేఖర్‌, ఎఎన్‌ఎంలు శివశేశమ్మ, సరస్వతి, పుష్ప, పుష్పలత, రామేశ్వరీ , కరుణమ్మ, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement